వెండితెరపై కొంత మంది జోడీ మంచి సక్సెస్ అందుకుంటుంది.. దాంతో ఆ జోడీనే కంటిన్యూ చేయాలని చూస్తుంటారు దర్శక, నిర్మాతలు. తాజాగా పిల్లా నువ్వులేని జీవితం చిత్రంతో హీరోగా పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మరో విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సుప్రీమ్’ చిత్రంలో నటించాడు.  ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన అందాల భామ రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీపై అప్పట్లో తెగ కామెంట్స్ వచ్చాయి.. ఈ చిత్రం మంచి హిట్ కావడంతో మరోసారి మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.  ఈ చిత్రం కూడా మంచి హిట్ అయ్యింది.  దాంతో వెండితెరపై ఈ జోడికి మంచి మార్కులు పడ్డాయి. 

 

  ఆ మద్య సాయి ధరమ్ తేజ్ నటించిన ఆరు చిత్రాలు వరుస ఫ్లాపులు కావడంతో కథ ఎంచుకునే  విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు సాయిధరమ్ తేజ్.  అంతే కాదు కామెడీ, ఫ్యామిలీ తరహా చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్టు ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.  ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ చిత్రం ఫుల్ లెన్త్ కామెడీ, ఎమోషన్స్ తో ఉండబోతుందట.  

 

ఈ చిత్రం తర్వాత దేవ కట్టా దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒక పాత్ర కోసం నివేద పేతురేజ్ ని తీసుకున్నట్లు సమాచారం. అయితే రెండో హీరోయిన్ గా సాయి ధరమ్ తేజ్ కి అచ్చొచ్చిన బ్యూటీ రాశీ ఖన్నాని తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో రాశి ఖన్నాతో ఒక పాటతో పాటు కొన్ని సీన్లు వుంటాయని చెబుతున్నారు. మరోసారి వెండితెరపై ఈ జోడీ ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: