తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం మూవీస్ లో నటించిన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.  ఆ తర్వాత బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ కూడా సెట్ కాలేకపోయింది. దాంతో దక్షిణాదివైౌపు దృష్టిమల్లింది. ఇదే సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీలో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ బ్యూటీకి వరుస ఛాన్సులు వచ్చాయి.  వరుస విజయాలతో మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఫుల్ ఫాంలో ఉంది. ఇటు టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్‌లో నూ పూజాకు వరుస ఆఫర్లు వస్తున్నాయి.

 

ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని బుట్టబొమ్మ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో మరోసారి ‘అలా వైకుంఠపురములో’ మూవీలో నటించింది.  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  దాంతో పూజా హెగ్డేకి మరింత పేరు వచ్చింది.  ఇలా వరుస విజయాలు అందుకుంటూ వస్తున్న పూజా హెగ్డే త్వరలో ప్రభాస్ సరసన నటిస్తుంది.  తాజాగా ఫర్హాద్ సామ్జీ తెరకెక్కిస్తోన్న కబీ ఈద్ కబీ దీవాళి అనే చిత్రంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి మొదటిసారిగా రొమాన్స్ చేయబోతుంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో పూజా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుందట.అదేంటంటే ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్‌ను తగ్గించుకుందట పూజా. 

 

సల్మాన్ పై గౌరవంతో ఈ అమ్మడు తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకుందట.  పూజా పారితోషికం తగ్గించుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే పూజా ప్రస్తుతం తెలుగులో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని ఆఫర్లు ఆమె చేతిలో ఉన్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: