తెలుగు ఇండస్ట్రీలో శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుస గుసలాడే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా. ఈ అమ్మడు నటి మాత్రమే కాదు మంచి సింగర్ . తెలుగు లో మాత్రమే కాదు ఈ మద్య తమిళ్ లో కూడా వరుస ఛాన్సులు దక్కిించుకుంటుంది. తెలుగు లో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్, ప్రతిరోజూ పండుగే చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మంచి విజయం అందుకుంది. తెలుగు లో వరుస విజయాలు అందుకుంటున్న ఈ బ్యూటీ ఎక్కువగా సామాజిక కార్యక్రమాలలో భాగం అవుతూ ఉంటుంది. ఈ భామ ఓ ప్రైవేట్ కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొంది.కమర్షియల్ లో ఈ పని తనకి గిట్టుబాటయ్యేదే కాని అక్కడ ఈ అమ్మడు మరో మంచి పని చేసింది.
సాధారణంగా ఎవరైనా డబ్బు దానం చేస్తుంటారు.. ఏదైనా విరాళం ఇస్తుంటారు. కానీ చాలా అరుదుగా నేత్రదానం, అవయవ దానం చేస్తుంటారు. తాజాగా నటి రోజా నేత్రదానం ప్రాధాన్యత అందరికి తెలియజేసే విధంగా తాను కూడా నేత్రదానం చేయడానికి ముందుకొచ్చింది.ఈ విషయాన్ని సోషల్ పోస్ట్ ద్వారా పంచుకుంది.మొత్తానికి రాశీ ఖన్నా చేసిన ఈ పనిని మిగిలిన సెలబ్రిటీలు కూడా ఫాలో అయితే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
” నేను నా కళ్ళు దానం చేశాను? మరి మీరు కూడా చేసారా’ అంటూ అవగాహనా పెంచే విధంగా రాశీఖన్నా పోస్ట్ పెట్టింది.దీనిపై నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్ అదరగొట్టేస్తున్నారు. గత ఏడాది ప్రతిరోజూ పండుగ చిత్రంతో మంచి హిట్ అందుకున్న ఈ బ్యూటీ వరుసగా ఛాన్సులు కొట్టేస్తుంది. త్వరలో మరోసారి సాయి ధరమ్ తేజ్ తో ఓ చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. అయితే రాశీఖన్నా చేసిన నేత్రదానం భవిష్యత్ లో ఎంతో మంది నటీమణులకు ఆదర్శంగా నిలుస్తుందని అంటున్నారు అభిమానులు.