మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా గా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్‌ అడుగడుగునా ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే వస్తోంది. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురించి గత రెండు సంవత్సరాలుగా మీడియాలో ఏదో ఒక చర్చ నడుస్తూనే వస్తోంది. దాదాపు ఏడాది కాలం పాటు ఊరించి ఊరించి ఎట్టకేలకు ఈ సినిమాలో అసలు హీరోయిన్ ఎవరో ఇప్పటికీ తెలియని పరిస్థితి. కొద్ది రోజుల క్రితం సీనియర్ హీరోయిన్ త్రిష‌ని మెగాస్టార్ పక్కన ఎంపిక చేశారు అని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా త్రిష క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. రెండేళ్లుగా తాను తాను తో వస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు మరోసారి బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభావంతో ఆచార్య సినిమా షూటింగ్ ను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్చి 31వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో థియేటర్లను సైతం మూసివేయాలని కేసీఆర్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీ సైతం తమ షూటింగులు సైతం బంద్ చేయక తప్పని పరిస్థితి ఏర్ప‌డింది.

 

 ఈ సంద‌ర్భంగా చిరంజీవి స్పందిస్తూ ... కరోనా మహమ్మారిని నియంత్రించాల్సిన బాధ్యత మ‌న అంద‌రికి ఉంద‌న్నారు.  దీన్ని ప్రభుత్వానికే వదిలేయకుండా ప్రజలంతా భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అంతేకాక తనవంతు బాధ్యతగా తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేస్తున్నానని ప్రకటించారు. కరోనా నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన వారికి తగిన చికిత్స అందించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా క్రీడలను వాయిదా వేయడం, సినిమా హల్స్‌ను, మాల్స్‌ను మూసివేడయం, స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ప్రకటించడం మంచి పరిణామం అని అన్నారు. ప్రజలు కూడా ముందుస్తు జాగ్రత్తలు పాటించాలని ఆయ‌న సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నానన్నారు. సినిమా షూటింగుల్లో కూడా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు పనిచేయాల్సి ఉందని, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 10 నుండి 15 రోజుల వరకు షూటింగులు వాయిదా వేస్తే మంచిదని భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను వాయిదా వేద్దామని దర్శకుడు కొరటాల శివతో చెప్పినప్పుడు ఆయన వెంటనే సరేనన్నారని చెప్పారు. ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేద‌ని ఆయ‌న భావించారు. కొంత ఇబ్బంది కలిగే అకవాశం ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను నియంత్రణ చేసే ఉధ్యమంలో సినీరంగం కూడా పాలుపంచుకోవాలని ఆయ‌న కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: