ప్రభాస్ సాహో తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం `జాన్`. ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ని పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగవ షెడ్యూల్ కోసం జార్జియాకి వెళ్ళారు ప్రభాస్. ఓ పక్క కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధితో అందరూ భయపడుతూ సినిమాలు, స్కూల్స్, మాల్స్ అన్నిటికి సెలవు ఇచ్చేసి ఎక్కడికి కదలకుండా ఉంటుంటే. హీరో ప్రభాస్ మాత్రం చాలా డేర్ చేసి ఎక్కడ షూటింగ్కి ఆటంకం కలగకుండా ఆయన డేర్ చేసి జార్జియాకి వెళ్ళారు. అంతే కాక అక్కడ ఛేజింగ్ ఫైట్ సీన్ ఒకటి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. ఇక ప్రభాస్ తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్కి మిగతా సినిమా షూటింగ్ వాళ్ళంతా అవాక్కయ్యారు.
తను ఎంతో డెడికేషన్తో వర్క్ కంప్లీట్ చెయ్యాలనే ఉద్దేశ్యంతో కరోనాని కూడా ఎదిరించి ముందుకు వెళ్ళడం చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో ఆయనకు సలాం కొడుతున్నారు. తన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డెసిషన్కి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అందులోనూ వేరే దేశంలో నుంచి మన దేశానికి వ్యాపిస్తున్న ఈ వ్యాధి బారి నుండి అందరూ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంటే కేవలం ఒక మాస్క్ ధరించి ఎంతో డేర్గా ప్రభాస్ వేరే దేశానికి వెళ్ళి షూట్ మొత్తాన్ని కంప్లీట్ చెయ్యడం పై ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు.
అయితే ఇప్పుడు పూజ హెగ్డేకి సంబంధించిన కీలక సన్నివేశాలని కూడా అక్కడే ప్లాన్ చేశారట. దీంతో పూజా టీమ్తో కలిసి జార్జియా పయనమైంది. ఇస్తాంబుల్ ఏయిర్ పోర్ట్కు చేరుకున్న పూజా ఇన్స్టాలో ఓ ఆసక్తికరమైన ఫొటోని పోస్ట్ చేసింది. `సినిమాలంటే ప్రేమ. అందుకే జార్జియా వచ్చాను అని పూజా పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్, పూజాల డెడికేషన్ కి అందరూ అవాక్క్యిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ నాగశ్విన్ చిత్రంలో కత్రినాకైఫ్ని హీరోయినా తీసుకోవాలిన అనుకుంటున్నారట. అయితే ఆ విషయాన్ని నాగ అశ్విన్కి చెప్పగా ఆయన ఒప్పుకోలేదని సమాచారం. ఆయన వేరే హీరోయిన్ని అనుకున్నారట. ఇక ఈ వారం ప్రభాస్ విశేషాలివే.