సబ్బు బిల్లా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకు అనర్హం అన్నారు శ్రీశ్రీ.  ఇప్పుడు జబర్ధస్త్ లో కూడా కాదేదీ కామెడీకి అనర్హం అంటున్నారు. ప్రపంచం అంతా వణికిస్తున్న కోరానా వైరస్ పై ఇప్పుడు జబర్ధస్త్ లో కామెడీ పంచ్ లు పేలుస్తున్నారు.  ఏడేళ్లుగా ఎన్నో రకాల స్కిట్స్ తో జబర్ధస్త్ కామెడియన్లు తమదైన కామెడీ పండిస్తున్న విషయం తెలిసిందే.  సమయానుకూలంగా తమ కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తున్నారు.  ఇప్పుడు ప్రపంచంలో కరోనా సృష్టిస్తున్న ప్రళయం గురించి అందరూ బాధపడుతూ.. ఎన్నో జాగ్రత్తలు పడుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా కోరల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో జబర్ధస్త్ లో కరోనాపై కామెడీ పంచులు వేసి నవ్వించారు కమెడియన్లు. తాజాగా ప్లే అయిన ఎపిసోడ్‌లో సునామీ సుధాకర్‌పై కరోనా జోక్ పేల్చేసాడు బుడ్డోడు నరేష్. వీడి ఫేస్ చూస్తే కరోనా కూడా కడుపు పగిలి చచ్చిపోతుంది అంటూ సెటైర్ వేసాడు. దాంతో పాటు హైపర్ ఆది కూడా కరోనా వైరస్‌పై జోకులు పేల్చేసాడు. తన టీమ్ మెంబర్స్‌ను కరోనా వైరస్‌తో పోల్చేసాడు. గల్లీ బాయ్స్ టీంలో సద్దాం హుస్సేన్ ఈ కరోనాతో కబడ్డి ఆడుకున్నాడు.చైనా నుంచి కరోనా వచ్చిందంట.. దాన్ని చూసి అంతా పడి చచ్చిపోతున్నారు అని ఒకరంటే.. అంత పెద్ద ఫిగరా అది అంటూ సద్దాం జోక్ పేల్చేసాడు. 

 

ఓరినీ కరోనా అంటే బాలీవుడ్ నటి కరీనా కాదురా అనగానే తెలుసు లేవో.. కరీనా అంటే బాలీవుడ్.. కరోనా అంటే  చైనా అంటూ మరో పంచ్ వేసాడు.   ఇలా ఎవరికి వారే తమ స్కిట్స్ లో కరోనా ప్రసక్తి తీసుకు వస్తూ తమదైన పంచ్ లు పేలుస్తున్నారు.  సరే ఇది కామెడీ పరంగా చూస్తే ఓకే.. కానీ ఇప్పుడు కరోనా భారత్ లో కూడా విస్తరించి 84 మందికి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: