ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రధాన సమస్య కరోనా వైరస్‌. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు మరణించారు. దాదాపు లక్షా 40 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇండియాలోనూ ఈ వైరస్‌ తన ప్రభావాన్ని గట్టిగాన చూపిస్తోంది. ఇప్పటికే ఇండియాలో 80 కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ కేసులు కనిపిస్తున్నాయి. దీంతో జన జీవనం స్తంబించి పోతుంది.

 

ముఖ్యంగా వినోద రంగం మీద దీని ప్రభావం ఎక్కవుగా కనిపిస్తోంది. సినిమా షూటింగ్‌ లతో పాటు రిలీజ్‌ లు కూడా వాయిదా వేస్తున్నారు. తెలంగాణాలో థియేటర్లను మూసి వేస్తున్నట్టుగా ప్రకటించారు. పలు చిత్రాల రిలీజ్ డేట్‌ లను వాయిదా వేశారు. చిరంజీవి హీరోలు స్వచ్చంధంగా షూటింగ్‌ లు విరమించుకుంటున్నారు. బాలీవుడ్‌ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారీ చిత్రాల రిలీజ్‌ లు వాయిదా పడ్డాయి షూటింగ్ లు కూడా వాయిదా పడుతున్నాయి.

 

అయితే అందరూ షూటింగ్‌ లు వాయిదా వేస్తున్నా సల్మాన్‌ మాత్రం తగ్గేది లేదంటున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న రాధే సినిమా చిత్రీకరణ యథాతదంగా కొనసాగిస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2017లో రిలీజ్‌ అయిన కొరియన్ సినిమా ద అవుట్ లాస్‌కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌కు జోడిగా దిశా పటాని నటిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్‌ ను మార్చిలో ముగించాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
IHG

 

గతంలో సల్మాన్ మీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన వాంటెడ్‌, దబాంగ్ 3 సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రంజాన్ కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాలో రణదీప్‌ హుడా, జాకీ ష్రాఫ్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: