జబర్దస్త్ షో లో యాంకర్ గా అవతారం ఎత్తిన రష్మి గౌతమ్ కి ఎంతగానో క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు రష్మి గౌతమ్ తెలియనివారు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడు ప్రస్తుతం బుల్లితెర పై తనదైన యాంకరింగ్ తో అదరగొడుతోంది. జబర్దస్త్ ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా సుధీర్ తో  లవ్ స్టోరీ నడుపుతుంది అనే వార్తలతో ఈ అమ్మడికి మరింత క్రేజ్ వచ్చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్లో రష్మి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ఇక అటు సినిమాల్లో కూడా అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది ఈ ముద్దుగుమ్మ. 

 

 

 ఇప్పటి వరకు చేసిన సినిమాలలో తన అందాల ఆరబోతతో ఎంతోమందికి మతి పోగొట్టింది. దీంతో అటు సినిమాల్లో ఇటు బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు సంపాదించింది. ఇక రష్మీ నటించిన గుంటూరు టాకీస్ సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలు రష్మి అందాలకు అందరూ ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ఇక ప్రొఫెషనల్ గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది రష్మి. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు  సహా మూగజీవాల రక్షణ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. 

 

 

 

 ఇక తాజాగా కరోనా వైరస్ గురించి కూడా రష్మి గౌతమ్ ఆసక్తికర పోస్టు పెట్టింది. ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకు కరోనా  పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో   ప్రజలు చిగురుటాకులా వణికిపోతారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా సినిమా హాల్స్,  స్కూల్స్,  షాపింగ్ మాల్స్ లాంటివి ప్రదేశాలను మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఎయిర్ పోర్టులో కూడా బయట దేశాల నుంచి వస్తున్న వారికి ధర్మల్  స్కానింగ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన రష్మి... కరోనా  వైరస్ స్కానింగ్ కేవలం ఇంటర్నేషనల్ ప్రయాణికులకేనా  డొమెస్టిక్  ప్రయాణికులకు అవసరం లేదా అంటూ ప్రశ్నించింది. ఇక దీనిపై అటు నెటిజన్లు కూడా కాస్త భిన్నంగా స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: