ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ట్రిపుల్ ఆర్. వచ్చే ఏడాది సంక్రాంతికి ఎలా అయినా సరే విడుదల చెయ్యాలి అనే పట్టుదలతో ఉన్న రాజమౌళిసినిమా షూటింగ్ ని చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగానికి పైగా పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యుల్ ని ఇతర రాష్ట్రాల్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది అంటున్నారు. 

 

ఎన్టీఆర్ షూటింగ్ కూడా దాదాపుగా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ సినిమా కోసం ఇప్పటికే విదేశాలకు వెళ్ళాలి అని భావించినా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వెనక్కు తగ్గారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. రామ్ చరణ్ లుక్ ని ఆయన పుట్టిన రోజు నాడు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా సినిమా ఫస్ట్ లుక్ ని మాత్రం ఉగాది రోజు విడుదల చేస్తున్నారు. దీనితో లుక్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. 

 

అది పక్కన పెడితే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. జనవరి నుంచి మళ్ళీ మే కి వెళ్ళే అవకాశం ఉందనే టాక్ వినపడుతుంది. దానికి కారణం సినిమా షెడ్యుల్ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడమే అనేది సిని జనాల మాట. సినిమాలో కొన్ని కీలక భాగాలను విదేశాల్లో చెయ్యాల్సి ఉందని, కాని షూటింగ్ వాయిదా పడే సూచనలు ఉన్న నేపధ్యంలో దానిని వాయిదా వేస్తారని అంటున్నారు. వచ్చే ఏడాది మే కి ఈ సినిమా ను విడుదల చేసే ప్రయత్నం చేస్తారని ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: