ఇండస్ట్రీలో మంచి పట్టున్న ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. అయితే ఈ ఫ్యామిలీలో ముగ్గురు హీరోలున్నా వెండితెర మీద మాత్రం పెద్దగా కనిపించటం లేదు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు లాంగ్ గ్యాప్ తరువాత సినిమాలు చేస్తున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తున్న ఈ మంచు హీరోలు చేస్తున్న సినిమాలు ఫుల్ స్వింగ్ లో రెడీ అవుతున్నాయి. 

 

మంచు ఫ్యామిలీ మళ్లీ జోరు చూపిస్తోంది.. చాలా కాలం బ్రేక్ తీసుకున్న మోహన్ బాబు, విష్ణు, మనోజ్ మళ్లీ సినిమా లతో చేస్తున్నారు. మోహన్ బాబు అప్పుడెప్పుడో 2018 లో  గాయత్రి సినిమాలో ఫుల్ లెన్త్ రోల్ ప్లే చేశాడు. మహానటిలో చిన్న కామియో రోల్ చేశాడు. 2019 లోమళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. మళ్లీ సూర్య హీరోగా వస్తున్న ఆకాశమే హద్దురా సినిమాలో తన ఒరిజినల్ నేమ్ భక్తవత్సలం నాయుడు క్యారెక్టర్ లో నేవీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు మోహన్ బాబు . 

 

మోహన్ బాబు వారసుడు విష్ణు కూడా గత ఏడాది వోటర్ సినిమాతో కనిపించాడు. ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ ఓటర్ సినిమా ఎప్పుడు రిలీజ్  అయ్యిందో కూడా తెలియ లేదు. అలా మాయం అయిపోయాడు విష్ణు. మళ్లీ చాలా కాలం తర్వాత మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు . వరల్డ్ లోనే జరిగిన బిగ్గెస్ట్ ఐటి స్కామ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలో బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా కీలక పాత్ర లో నటిస్తున్నాడు.

 

మనోజ్ కూడా అప్పుడెప్పుడో  2017 లో ఒక్కడుండేవాడు సినిమా చేశాడు . ఎల్టీటీయి తీవ్రవాదిగా స్ట్రాంగ్ రోల్ లో కనిపించిన మనోజ్.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్నాడు . మళ్లీ లేటెస్ట్ గా అహం బ్రహ్మాస్మి అనే ఇంట్రస్టింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడు.  భారీ బడ్జెట్ తో  ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాని  శ్రీకాంత్ ఎన్ . రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు .  ఇలా ముగ్గురు మంచు హీరోలు  గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: