బుల్లితెర ప్రేక్షకులను నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ పంచేందుకు కామెడీ షోలు, రియాల్టీ షోలు, సీరియల్స్ ఇలా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో. ముఖ్యంగా ఏదైనా పండగ వచ్చిందంటే ఎంటర్ టైన్మెంట్ మరో లెవల్లో ఉంటుంది. ఇక ఉగాది కానుకగా ఈటీవీ వారు ‘పండగ సర్ పండగ అంతే’ అనే స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. పండుగ సర్ పండుగ అంటూ శ్రీముఖి ఈవెంట్ కి యాంకర్ గా షో మొదలుపెడుతుంది. ఇటీవల ఈ షో ప్రోమో విడుదల చేయగా.. రోజా, శేఖర్ మాస్టర్ ‘అల వైకుంఠపురములో’.. చిత్రంలోని ‘సామజవరగమనా’ పాటకు అదిరిపోయే స్టెప్స్ వేశారు. దీంతో పాటు పలు సూపర్ హిట్ సాంగ్స్కు హుషారుగా కాలు కదిపారు.
పచ్చ రంగు పరికిణి, రోజ్ కలర్ కాంబినేషన్ ఓణిలో రోజా సామజవరగమన అంటూ ఓ రేంజ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇక పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్ అయితే చెలరేగిపోయారు.. రోజా నడుస్తూ ఉంటే.. సామజవరగమన సాంగ్కి సిగ్నేచర్ స్టెప్ ఫ్లోర్ మొత్తం అరిగిపోయేలా డ్యాన్స్ చేశారు. వాస్తవానికి ఆన్స్క్రీన్ రోజా, శేఖర్ మాస్టర్ల డ్యాన్స్, కెమిస్ట్రీ, రొమాన్స్ ఏ రేంజులో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ఓ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు టీవీ షోస్తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ నుంచి నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజా అన్నీ తానేయై చూసుకుంటుంది.
ఇక ఆమె జోష్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్డ్, రియాలిటీ షోలతో క్షణం తీరికలేకుండా గడిపే రోజా, ఈ జెనరేషన్ యాంకర్లతో పోటీపడుతూ.. ఇప్పటికీ అదే ఎనర్జీతో తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తోంది. కాగా, ప్రస్తుతం రోజా, శేఖర్ మాస్టర్ డ్యాన్స్ ఈ వారం తెగ వైరల్ అయింది. దీంతో బుల్లితెరపై రోజా, శేఖర్ మాస్టర్లది పర్ఫెక్ట్ జోడి అని ప్రేక్షకులందరూ అనుకుంటున్నారు. మరోవైపు రోజా టైమ్ మేనేజ్మెంట్ చూసి ఆశ్యర్యపోతున్న వారు ఉన్నారు.