ప్రస్తుతం బుల్లితెరపై కామెడీ షోలు దూసుకుపోతున్నాయి. ఒకవైపు జబర్దస్త్ మరోవైపు అదిరింది షోతో నవ్వులు పూయిస్తున్నారు. అయితే చిన్న స్క్రీన్ పై ఎన్ని కామెడీ షోలు ఉన్న జబర్దస్త్ మించి ఏది లేదు. కామెడీ షోల యందు జబర్దస్త్ దూసుకుపోతుంది. ఈ షోతో ఎంతో మంది వారి టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. చాలా మందికి ఈ షో ద్వారా జీవనోపాధి పొందారు. ఈ షో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. 

 

 

 

ఈ షోకు మొదట నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. ఈ షో ద్వారా నాగబాబు కొత్తవారికి అవకాశాలను కల్పిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారు. అయితే జబర్దస్త్ నుండి చాలా మంది వెళ్లిపోయారు. కానీ నాగబాకు వెళ్లడం షోకి తీరని లోటు ఇది అంత మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం నాగబాబు, జబర్దస్త్ షో యాంకర్ అనసూయల మధ్య కొందరు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.

 

 

 

అనసూయ ఇటు బుల్లితెరపై అటు వెండితెరపై సందడి చేస్తుంది. బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో నటిగా మారారు. క్షణం సినిమాతో తనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకుంది. 'విన్నర్', 'ఎఫ్ 2' లాంటి చిత్రాలలో ఐటెం సాంగ్స్ లో నటించడంతో పాటు 'రంగస్థలం' సినిమాలో హీరో అత్తగా కనిపించి, విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ బ్యూటీ.

 

 

 

అయితే మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇద్దామని అనుకున్నారట టీం. చిరంజీవి హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సినిమాలో అనసూయకి ఓ రోల్ ఇవ్వాలని వారు భావించారు. కానీ ఇప్పుడు ఆ పాత్ర కోసం మరో నటిని సెలెక్ట్ చేసుకున్నట్లు వినికిడి. చిరంజీవి సినిమాలో అనసూయకి ఛాన్స్ రాకుండా తెరవెనుక నాగబాబు రాజకీయం చేసాడని కొందరి అభిమానుల వాదన. 

నాగబాబుకి రాజకీయం చేయాల్సిన అవసరం ఏం ఉందని అందరూ అనుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే నాగబాబు అదిరింది షోకి యాంకరింగ్ చేయమని అనసూయని ముందుగా అడిగారట. దానికి ఆమె ఒప్పుకోలేదని గుసగుస. ఆ కారణంగానే చిరంజీవి సినిమాలో అనసూయ కోసం అనుకున్న పాత్ర వేరే వెళ్లేలా చేశాడట నాగబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: