ప్ర‌స్తుతం మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌ర్వ‌త ఆయ‌న కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇక వంశీపైడిప‌ల్లి సినిమాతో ఆయ‌న బిజీ కావ‌ల్సి ఉంది. కానీ అది స్క్రిప్ట్ కుద‌ర‌క పెండింగ్ ప‌డింది. దాంతో కొర‌టాల సినిమాలో మ‌హేష్ అన్న వార్త‌లు రోజుకో ర‌కంగా వ‌స్తున్నాయి. కాసేపు ఆయ‌న అందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని. మ‌రికాసేపేమో అస‌లు ఆయ‌న రెమ్యూన‌రేష‌న్ దాదాపు 40 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చెయ్య‌డంతో డ్రాప్ అయ్యార‌ని ఇలా ర‌క ర‌కాల వార్త‌లు విన‌బ‌డుతున్నాయి. 

 

ఇక ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం మ‌హేష్ మాత్రం సైలెంట్‌గా త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. అదేంటి అనుకుంటున్నారా. అదేనండి... త‌ను మాత్రం ఏదో ర‌కంగా కెమెరాను ఫేస్ చేస్తున్నారు. దాని వ‌ల్ల  డ‌బ్బులు సంపాదించ‌డం మాత్రం ఎక్క‌డా ఆగ‌లేదు. ఎలా అంటే... చిన్న చిన్న టివి ప్ర‌క‌ట‌లు ప్లాన్ చేస్తూ ఇంటిల్లిపాదిక ద‌గ్గ‌ర‌వుతున్నాడు. దాంతో మ‌హేష్ ఎప్పుడూ సినిమాల‌కు ఆయ‌న దూరంగా ఉన్న భావ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కి క‌ల‌గ‌డం లేదు. ఇదంతా ఆయ‌న ప‌క్కాప్ర‌ణాళిక‌తో చేస్తున్న‌ట్లు స‌మాచారం.

 

అందుకు అనుగుణంగానే వంశీపైడిప‌ల్లి స్క్రిప్ట్ వ‌ర్క్‌పూర్తి కాక‌పోయినా మైత్రి మూవీస్‌లో యంగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురాంతో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ అప్పుడే మొద‌లెట్టేశారు. ఈ క‌థ మ‌హేష్‌కి బాగా న‌చ్చింద‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. దానివ‌ల్ల వంశీపైడిప‌ల్లికంటే ముందుగానే ఈ సినిమా ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక ప‌క్క క‌రోనా మ‌రో ప‌క్క ప‌రీక్ష‌లు వ‌ల్ల సినిమాల‌కు ఈ సారి కొంత గ్యాప్ వ‌చ్చేట‌ట్టు ఉంది. ఫైన‌ల్‌గా ఈ ఉగాదిరికి లాంఛ‌నంగా మ‌హేష్ సినిమా ప్ర‌క‌టించ‌నున్నారు. జూన్‌లో సినిమా రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ వారం మ‌హేష్ విశేషాలివే.

మరింత సమాచారం తెలుసుకోండి: