శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీ తో హీరోయిన్ గా పరిచయమైంది సాయి పల్లవి. మాలీవుడ్ లో ప్రేమమ్ చిత్రంలో నటించిన సాయిపల్లవి.. తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు తెలంగాణ యాసలో భానుమతి ఒక్కటే పీస్ అంటూ సందడి చేసింది. అప్పటికే తెలుగులో సాయి పల్లవి కి మంచి పరిచయం ఉంది కాకపోతే ఒక ఒక డాన్సర్ గా ఆమె నెంబర్ వన్ పొజిషన్లో ఉంది. 

 

 

ఫిదా చిత్రం తర్వాత సాయిపల్లవి నటించిన మరికొన్ని చిత్రాలు తెలుగు తమిళంలో మంచి విజయం సాధించాయి. మరోసారి శేఖర్కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది ఈమధ్య ఒక టీచర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో నాగ చతన్య సాయి పల్లవి ముద్దు పెట్టుకోవడం చూపించారు. దాంతో నాగచైతన్య కాస్త సిగ్గు పడుతూ ఏడుస్తున్నట్టు కనిపించింది.

 

 

గతంలో కణం చిత్రంలో నాగ శౌర్య నటించారు ఈ చిత్రంలో సాయి పల్లవి హీరో ని డామినేట్ చేసిందని కొన్ని రూమర్లు వచ్చాయి. అయితే మొదటి నుంచి సాయి పల్లవి తనకు నేచురల్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య మారి 2 చిత్రంలో సైతం చాలా రఫ్ గా నటించిన విషయం తెలిసిందే. ఇలాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు అని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ అంతేకాదు సాయి పల్లవి మేకప్ కూడా వేసుకోదు డైలాగ్స్ కూడా చాలా నేచురల్ గా మాట్లాడుతుంది. తాజాగా లవ్స్టోరీ సినిమాలో సాయి పల్లవి చైతన్య డామినేట్ చేస్తుంది లేక చేతునే సాయి పల్లవి చేస్తారా తేలిపోతుంది. ఫిదా చిత్రంలో కూడా వరుణ్ తేజ కంటే సాయి పల్లవి ఎక్కువ పేరు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: