టాలీవుడ్ బ్యాచలర్స్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్గా హీరో నితిన్ ని చెప్పుకుంటారు. అయితే ఇటీవలె నిశ్చితార్ధం జరిగిన నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నితిన్ పెళ్లి పనులు పసుపు కొట్టి మరీ మొదలుపెట్టేశారు. ఇక ఫిబ్రవరిలో పెళ్లికి ముందు ఇంట్లోనే ఓ చిన్న ఫంక్షన్ ను కూడా చేశారు. నితిన్ కు కాబోయే భార్య పేరు షాలిని. బిజినెస్ మేనేజ్మెంట్ పూర్తి చేసిన షాలిని సొంత ఊరు నాగర్ కర్నూల్.
ఆమె తల్లిదండ్రులిద్దరూ కూడా డాక్టర్లు. ఆమె తల్లి గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నాగర్ కర్నూల్లో ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. నితిన్ గత ఐదు సంవత్సరాలుగా షాలినీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గానే వీరిద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమవివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఏప్రీల్ 16న దుబాయ్ లో వీరి వెడ్డింగ్ కు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ బాగా ఉండటంతో తమ వెడ్డింగ్ డెస్టినేషన్ మార్చుకున్నాడు నితిన్. కరోనా వల్ల ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంత మాత్రం సరికాదని నితిన్ ఫాదర్ దాన్ని మార్చి ఇండియాలోనే వివాహం జరిపించాలని డిసైడ్ అయ్యారట.
అయితే ఏప్రిల్ 16 న హైదరాబాద్ లోని వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 15న నిశ్చితార్ధం, ఏప్రిల్ 16 వెడ్డింగ్ కి ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారట. పెళ్లి తర్వాత ఏప్రిల్ 21న హైదరాబాద్లోనే గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ని కూడా చేయబోతున్నారు. ఈ రిసెప్షన్ కి సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారని సమాచారం. మరి ఈ వివాహం ఇలా ప్లాన్ చెయ్యడానికి ప్రధాన కారణం.