రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అయితే ఆయనను సామాన్య జనం ఇష్టపడటం అన్నది చాలా కామన్. అయితే సెలబ్రెటీలు కూడా టాలివుడ్ టాప్ హీరోయిన్లు కూడా ప్రభాస్తో నటించే ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటూ ఈ ప్యాన్ ఇండియా హీరో చుట్టూ తిరుగుతుంటారు. ఇక ఇదిలా ఉంటే... అందరూ ప్రభాస్తో చెయ్యాలి.. ఆయనతో ఒక్కఛాన్స్ వచ్చినా బావుండు తని కోరుకుంటుంటే... ప్రభాస్ మాత్రం బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ అంటే ఇంట్రస్ట్ చూపిస్తున్నారంటే. అదేంటి అనుకుంటున్నారా...నిజమండి. ప్రభాస్ నటించిన గత చిత్రం `సాహో`లో కత్రినని పెట్టాలని ఎంతో ఆశగా చూశారంట. కానీ దర్శకుడు సుజిత్ మాత్రం అందుకు ఒప్పుకోలేదంట. శ్రద్ధకపూర్ మాత్రమే ఆ పాత్రకి బావుంటుందని ప్రభాస్ని కన్విన్స్ చేశారట.
అయితే ఇటీవలె నాగఅశ్విన్తో ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ చిత్రంలో అయినాసరే కత్రిన కైఫ్ని పెట్టాలని ప్రభాస్ నాగశ్విన్ని అడిగారట. అయితే దానికి ఆయన కూడా ఒప్పుకోలేదట. ఎందుకంటే ప్రస్తుతం కత్రినకి బాలీవుడ్లో కాస్త క్రేజ్ తగ్గిందని ఫేడ్ అవుట్ అవ్వడంతో నాగఅశ్విన్ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదంట. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. ఈ చిత్రం కేవలం పాన్ ఇండియా సినిమాలా కాకుండా, పాన్ వరల్డ్ సినిమాలా తీసుకురానున్నారు. దీన్నిబట్టి చిత్రం ఎంత భారీగా తెరకెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం భారీ తారాగణాన్ని తీసుకుంటున్నారు. ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ విషయమై ఆమెతో ఇంకా సంప్రదింపులు జరపలేదట.. అయితే ఆమె ఈ చిత్రంలోనటించే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ‘జాన్’ చిత్రం పూర్తవగానే ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ పనులను శరవేగంగా మొదలెట్టనున్నారు. నాగ్ అశ్విన్ తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రని వేసుకున్నారు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ చిత్రం మీద ఫ్యాన్స్కి అంచనాలు కూడా భారీ స్ధాయిలోనే ఉన్నాయి.