హీరో అడవిశేష్ యంగ్ హీరోల్లో ప్రస్తుతం క్రేజ్లో ఉన్న హీరో అని చెప్పాలి. ఇక ఈ హీరో గత సంవత్సరం ఎవరు అనే ఓ భారీ థ్రిల్లింగ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఆయన తర్వాత చిత్రం మేజర్ అనే టైటిల్తో రాబోతుంది. 2008 ముంబై టెర్రర్ అట్టాక్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే నేడు సందీప్ ఉన్ని కృష్ణన్ జయంతి.
ఈ సందర్భంగా మేజర్ చిత్ర యూనిట్ భారీ సర్ప్రజైన్ని ఫ్యాన్స్ కోసం ప్లాన్ చేసింది. అదేమిటంటే ఈ చిత్ర అప్డేట్స్ సిద్ధం చేసుకొని ఉంచారట. ఐతే కరోనా వైరస్ కారణంగా విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వారు ఈ అప్డేట్స్ కూడా వాయిదా వేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. మరి ఈ చిత్ర నిర్మాణాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం భారీ కసరత్తు కూడా ఆయన చేసినట్లు ఇటీవలె సోషల్ మీడియా వేదిక అడివి శేషు తెలిపారు. అంతేకా శారీరకంగా మేకోవర్ కావడంతో పాటు, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యారు.
ఇక మొదటిసారి తన సంస్థ ద్వారా వచ్చే చిత్రానికి ఇలాంటి వైరస్ వచ్చిందేంటని మహేష్ కాస్త అప్సెట్ అయ్యారట. అంతేకాక అమరవీరులైన వారి జ్ఞాపకార్ధం ఈ రోజు అప్డేట్ వస్తుందని చూస్తున్న మేజర్లు కూడా చాలా బాధపడ్డారట. ఇక ఇదిలా ఉంటే మరికొంత మంది కరోనా వైరస్కి సోషల్ మీడియాలో ఇచ్చే అప్డేట్కి సంబంధం ఏముందంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ధోరణి వింటుంటే కాస్త నిజమే కదా అనిపిస్తుంది కాని మరి వారి ఆలోచనలు ఏమున్నాయో మనకేమి అర్ధమవుతుంది. లేదంటే టెక్నికల్గా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే ఆలోచనలు వస్తున్నాయి.