రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సైరా సినిమా తర్వాత చిరంజీవి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా ఆచార్యా అనుకుంటుంది చిత్ర యూనిట్. దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వేసవి తర్వాత ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ని కరోనా వైరస్ కారణంగా వాయిదా వేసారు. దీనితో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది స్పష్టత లేదు. 

 

షూటింగ్ ఆలస్యం అయితే మాత్రం ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవికి క్రేజ్ ఉంది. దీనితో ఆయనతో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి మాత్రం జాగ్రత్తగా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన కొరటాల శివ తర్వాత చేసే సినిమా లూసిఫర్ రీమేక్ అని అంటున్నారు. కాని అది కాదు అనేది కొందరి మాట. దానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు ఎవరో ఫైనల్ కాలేదు అంటున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో ఆగారట. 

 

క్రిష్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చలు జరుగుతున్నాయి. లూసిఫర్ రీమేక్ విషయంలో చిరంజీవి అంత ఆసక్తి చూపించడం లేదు అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ఆయన సినిమా గురించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని చిరంజీవి మాత్రం ఏ ఒక్కటి ఫైనల్ చేయడం లేదు. దీనితో నిర్మాత రామ్ చరణ్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. రామ్ చరణ్, చిరంజీవి సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడని అంటున్నారు. చిరంజీవి మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: