యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం హిట్ అన్న మాటకి ఆమడ దూరంలో ఉన్నాడు. వచ్చిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. అందరు అర్జున్ రెడ్డి నుంచి బయటకి రా బాబు అంటున్నారు. రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా మిగిలింది. గీత గోవిందం సినిమా తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమా ఒక్కటి హిట్ అవలేదు. దాంతో సగం షూటింగ్ జరిగిన హీరో అన్న సినిమా కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆశలన్నీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా మీదే. 

 

తెలుగు తో పాటు హిందీ, తమిళంలోను ఈ సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది కాబట్టి తర్వాత సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే కావాలని విజయ్ మేకర్స్ ని అడుగుతున్నారట. పూరి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ మైత్రీ సంస్థకి ఓ సినిమా చేయాలి. అందుకనే మైత్రీ సంస్థ నిర్మాతలను విజయ్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని నిర్మించమని అంటున్నాడట.

 

అయితే విజయ్ కి క్రేజ్ ఉంది గాని పాన్ ఇండియా క్రేజ్ మాత్రం లేదన్న సంగతి తెలిసిందే. అందుకే మేకరస్ మామూలు చేద్దామని చెప్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే ఓ సిట్టింగ్ జరిగింది. అయితే విజయ్ దేవరకొండ మరో సంస్థను కూడా పాన్ ఇండియా సినిమా కోసం అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ ను విజయ్ దేవరకొండ అప్రోచ్ అయి ప్రభాస్ తో సాహో నిర్మించినట్టే తనకు ఓ పాన్ ఇండియా సినిమా తీసిపెట్టమని విజయ్ అడిగాడట. అయితే ఇది తెలిసిన కొందరు అసలు హిట్సే లేవు కదా ముందు ఒక మంచి హిట్ కొట్టి చూపించు. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమా గురించి ఆలోచిద్దామని అంటున్నారట. నిజమే కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: