స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురం లో సినిమాతో తన కెరీర్ లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాకు పోటీగా వచ్చినా అల వైకుంఠ పురం లో ఏకంగా 160 కోట్ల షేర్ రాబట్టి నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. అసలు అల వైకుంఠ పురం లో సంక్రాంతి పోటీలు ఇంత షేర్ సాధిస్తుందని ఎవరు ఊహించలేరు. ఈ సినిమా తర్వాత బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ ఒక లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడట.

 

 ఇదిలా ఉంటే అల వైకుంఠపురం లో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో బన్నీ సుకుమార్ తో చేసే సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బన్నీ మార్కెట్ బాగా పెరగడంతో రేటు కూడా అలాగే చేశాడట. ప్రస్తుతం ఉన్న నిర్మాతలు మైండ్ బ్లాక్ అవుతుందట. ఈ విషయంలో బన్నీ బెట్టు వీడ‌టం లేదని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ టాక్‌.

 

బ‌న్నీ రేటు తన కెరీర్లోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు తీసుకోని విధంగా ఉందట. దీంతో బన్నీతో సినిమా చేయాలనుకునే నిర్మాతలు ఈ రేటు కష్టమైనా తప్పని సరి పరిస్థితుల్లో చేస్తున్నారట. మరి కొందరు నిర్మాతలు అయితే అంత రేటు తమకు గిట్టుబాటు కాదని గుసగుసలు ఆడుకుంటున్నట్టు సమాచారం. ఇక ఇటీవ‌లె కొంత గ్యాప్ తీసుకున్న‌ప్ప‌టికీ త‌న‌కున్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని `అల‌` హిట్టుతో నిరూపించుకున్నారు బ‌న్నీ. మ‌రి డియాండ్ చెయ్య‌డంలో త‌ప్పేముంద‌ని కొంద‌రు వాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: