టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి కి జూలై సెంటిమెంట్ విపరీతంగా ఉంటుంది. ఈ నెల లో రిలీజ్ చేసిన చాలా సినిమాలు ఆయనకి ఇండస్ట్రీ రికార్డ్స్ ఇచ్చినవే. అంతేకాదు రాజమౌళి ఇన్నేళ్ళ సినీ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ అనేది లేకపోవడానికి కారణం కూడా జూలై నెల అని భావిస్తుంటారు. అంతగా రాజమౌళి కి జూలై నెల సెంటిమెంట్ ఉంటుంది. రాజమౌళి కెరీర్ లో ఎన్.టీఅర్ తో తెరకెక్కించిన సింహాద్రి జూలైలోనే రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. అటుపై అప్పటి ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన మగధీర సినిమా కూడా జూలైలోనే విడుదలై సంచలనాలు సృష్ఠించింది. రాజమౌళి క్రియేవిటీ ఏ రేంజ్ లో ఉందో చాటి చెప్పిన నాఇ సమంతల తో తెరకెక్కించిన ఈగ సినిమా కూడా జులైలోనే రిలీజ్ అయి సంచలనాలు సృష్ఠించింది.


 
ఇక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన 'బాహుబలి: ది బిగినింగ్' కూడా అదే నెలలో రిలీజ్ అయి తెలుగు సినిమా స్థాయి ఎంతటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. అందుకే రాజమౌళికి జూలై నెల చాలా సెంటిమెంట్ గా భావిస్తుంటారు. అందుకే రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు జూలై లో రిలీజ్ చేసే విధంగానే ముందు నుంచి పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కాని ఈ సారి ఆ సెంటిమెంట్ ని వదిలేయాల్సిన పరిస్థితులు నెలకిన్నాయి. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సెంటిమెంట్ నెల జూలై నుంచి సంక్రాంతికి షిఫ్టయింది.

 

దాంతో ఈ జూలై నెల లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోతున్నాడట. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కబోతున్న తాజా చిత్రం 'బాక్సర్'. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. నాన్ స్టాప్ గా షూటింగ్ కంప్లీట్ చేసి జూలైలో నెలలో రిలీజ్ చేయాలని మేకర్స్  ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వెంట వెంటనే కంప్లీట్ చేసి 3-4 నెలల్లోపే సినిమాని రెడీ చేసే దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను జూలై లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని తెలుస్తుంది. మరి రాజమౌళి లక్కి మంథ్ వరుణ్ కి వర్కౌట్ అవుతుందా ..చూడాలి. 
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: