ప్ర‌స్తుతం నటులు హీరో విలన్‌ అన్న హద్దులు పెట్టుకోకుండా అన్ని రకాల పాత్రలకు సై అంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలు పాత్ర బాగుంటే.. విల‌న్‌గా చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేస్తున్నారు. ఆ లిస్ట్‌లో ఆర్‌ఎక్స్‌ 100 ఫేం కార్తికేయ కూడా ఒక‌రు. బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో సెన్సేషన్‌ సృష్టించాడు కార్తికేయ. అంతకు ముందు ప్రేమతో మీ కార్తిక్‌ అనే సినిమాలో నటించినా.. హీరోగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం ఆర్‌ఎక్స్‌ 100తోనే.  ప్ర‌స్తుతం హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా కార్తికేయ కెరీర్ మంచి స్పీడుతో దూసుకుపోతోంది. ఇక విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’. 

 

మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రంతోనే కార్తికేయ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రంలో త‌న న‌ట‌న‌తో కార్తికేయ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అలాగే ప‌లువురి ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. విల‌న్ రోల్ చేయ‌డం ఫ‌స్ట్ టైమ్ అయిన‌ప్ప‌టికీ.. ఏ మాత్రం భ‌యం లేకుండా సినిమాకు ప్రాణం పెట్టి మ‌రీ అంద‌రినీ మెప్పించాడు. ఈ చిత్రంలో నాని, కార్తికేయల మద్య సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇటీవ‌ల కోలీవుడ్ స్టార్‌ హీరో అజిత్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కార్తికేయ విలన్‌గా ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి.

 

ఇందులో విలన్‌ పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందట. అందులో యంగ్ హీరో అయితే సూట్ అవుతుందని భావించి దర్శక, నిర్మాతలు కార్తికేయను సంప్రదించినట్టు సమాచారం. అందుకు కార్తికేయ కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం గీతా ఆర్ట్స్ లో కార్తికేయ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. `చావు క‌బురు చ‌ల్ల‌గా` అనే టైటిల్ ఖ‌రారు చేశారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా న‌టిస్తున్న ఈ చిత్రంతో  కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి  బన్నీ వాసు నిర్మాత. మ‌రియు ఈ చిత్రంలో కార్తికేయ బస్తి బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.

 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: