తెలుగు చిత్ర పరిశ్రమలో  విలన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు హీరో పాత్రల కంటే విలన్ పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అయితే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ పరిశ్రమలకు చెందిన వాళ్లు కూడా వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు ఉన్నారు. ఇలా బాలీవుడ్ కు  చెందిన ఓ నటుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించాడు. తన అద్భుతమైన నటనతో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి... ఆ తర్వాత ప్రస్తుతం సాఫ్ట్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదు విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా తన నట ప్రస్తానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ దూసుకుపోతున్న మురళి  శర్మ . 

 

 

 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  విలక్షణ నటుడు ప్రకాష్ స్థానాన్ని  మురళీ శర్మ తన నటనతో భర్తీ చేశారు అని చెబుతూ ఉంటారు. మురళి శర్మ నటన తో అదరగొట్టడం  వల్లే ప్రకాష్ రాజు కు  అవకాశాలు రావడం లేదని కూడా కొంతమంది అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి తనదైన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు మురళి శర్మ. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కానీ ఇప్పుడు మురళీ శర్మ కు విలన్ పాత్రలు  పూర్తిగా తగ్గిపోయాయి.. కానీ హీరో హీరోయిన్ లకు  తండ్రి పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులందరినీ మెప్పిస్తున్నాడు మురళి శర్మ. 

 

 

 ఇక మురళీశర్మ మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం అలా వైకుంఠపురమూలో హీరో అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏకంగా తన కొడుకు అల్లు అర్జున్ కు  బంటి అనే పేరు పెడతాడు మురళి శర్మ. ఇక చిన్నప్పటినుంచి అల్లు అర్జున్ కు తండ్రి విలన్ గా మారి పోతూ ఉంటాడు. ఏదడిగినా కొనకుండా... ప్రతి విషయంలో కాంప్రమైజ్ చేస్తూ... ప్రతి విషయంలో అల్లు అర్జున్ కి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో హీరోలను ఢీకొట్టే విలన్ పాత్రలో నటించిన మురళి శర్మ... ప్రస్తుతం నాన్న పాత్రల్లో కూడా నటిస్తూ హీరోలకు విలన్ గా మారిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: