టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తుంది బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే.  ముకుంద, ఒకలైలా కోసం లో నటించిన ఈ అమ్మడు తర్వాత అల్లు అర్జున్ తో నటించిన ‘దువ్వాడ జగన్నాథం’తో మంచి హిట్ అందుకుంది.  ఈ మూవీ పూజా హెగ్డే జాతకాన్ని పూర్తిగా మార్చేసింది.  వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, వరుణ్ తేజ్ ల సరసన ఛాన్సులు కొట్టేసి ఈ మద్య అల్లు అర్జున్ తో ‘అలా వైకుంఠపురములో’ సూపర్ సక్సెస్ అందుకుంది. అంతే కాదు ప్రభాస్, అఖిల్ సరసన కూడా నటిస్తుంది.  తెలుగు, తమిళంతో పాటు ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. ఇప్పటికే హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ సరసన నటించిన పూజా హెగ్డే త్వరలో కండల వీరుడు సల్మాన్ మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. 

 

వరుస విజయాలతో ఈ అమ్మడి మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం అనుష్క, నయనతార, త్రిష, కాజల్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 

ఈ మద్య యువ దర్శకుడు హను రాఘవపుడి ఓ లేడీ ఓరియెంటెడ్ కథ పూజా హెగ్డేకి వినిపించినట్లు సమాచారం.. ఆమె కూడా దానికి ఓకే చెప్పిందట. కాకాపోతే డేట్స్ చూసుకుని ఆమె అధికారికంగా చెప్పవలసి ఉందట. ఆమె ఓకే అంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు.  హీరోయిన్ ప్రాధాన్యత మూవీ అంటే అన్నీ తన భుజాలపై వేసుకొని మోయాల్సి ఉంటేంది.. మరి ఈ గ్లామర్ బ్యూటీ ఆ స్థాయిలో మెప్పించగలదా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: