టాలీవుడ్ లోకి అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి.  అందం, అభినయం ఉన్న ఈ అమ్మడికి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. దాంతో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి ఇప్పుడు ఓ అదృష్టం కలిసి వచ్చింని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. మొన్నటి వరకు ఎన్నికల బిజీ.. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులపై హడావుడిగా ఉంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్..   'పింక్' రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘వకీల్ సాబ్’ నిర్మితమవుతుంది.  ఇప్పటికే పవన్ కళ్యాన్ ఫస్ట్ లుక్ .... సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాలో నివేద థామస్, అనన్య, అంజలి నటిస్తున్నారు.

 

ఇందులో నివేదా థామస్ పాత్ర చాలా కీలకం అని అంటున్నారు.  ఈ సినిమాలో అంజలి , నివేదాథామస్ లైంగిక వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిలుగా కీలక పాత్రలో నటిస్తున్నారు.  అయితే ఈ మూవీలో పవన్ కళ్యాన్ కి ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పటికే శృతి హాసన్ ని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి అని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

 

ప్రస్తుతం లావణ్య ప్రస్తుతం తెలుగులో `ఏ1 ఎక్స్ ప్రెస్` సినిమాలో సందీప్ కిషన్ కు జంటగా నటిస్తోంది. పవన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. హిందీ .. తమిళ భాషల్లో ఆదరణ పొందిన ఈ కథ, తెలుగులో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి. ఒకవేళ పవన్ సరసన నిజంగానే ఆ బ్యూటీకి ఛాన్సు వస్తే మంచి లక్కీ అనే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: