టాలీవుడ్ లో ఇప్పుడు వయసు మీద పడినా సరే హీరోలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు అగ్ర హీరోలుగా ఒక వెలుగు వెలిగిన హీరోలు ఇప్పుడు కుర్ర హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ హీరోలు. దీనితో దర్శకులు కూడా వారితో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారు. వసూళ్లు కూడా వీరి సినిమాలకు బాగానే వస్తున్నాయి. 

 

చిరంజీవి సైరా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే లూసిఫర్ అనే సినిమాలో నటిస్తారు. ఆ సినిమాకు దర్శకుడ్ని ఎంపిక చేసే పనిలో పడ్డారు నిర్మాత రామ్ చరణ్. ఇక కొరటాల దర్శకత్వంలో చేసే సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు స్పష్టత రావడం లేదు. సీనియర్ హీరోయిన్ త్రిష ని ఎంపిక చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరిగింది. కాని ఆమెను తప్పించారు. ఇక కాజల్, అనుష్క సహా పలువురు సీనియర్ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నారు. 

 

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన పక్కన నటించే హీరోయిన్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు. యంగ్ హీరోయిన్లు వారి పక్కన సరిపోవడం లేదు. దీనితో ఎవరిని ఎంపిక చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఎవరికి చూసినా సీనియర్ హీరోయిన్ నయనతార కనపడుతుంది. ఆమె కోలీవుడ్ లో బిజీ గా ఉంటుంది. దీనితో ఎవరిని ఎంపిక చెయ్యాలో అర్ధం కావడం లేదు. మరో సీనియర్ హీరో వెంకటేష్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందని నిర్మాతలు అంటున్నారు. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: