కరోనా వైరస్ భయాలు వెంటాడుతున్న పరిస్థితులలో వచ్చే నెల జరగబోతున్న టాలీవుడ్ హీరోలు నిఖిల్ నితిన్ పెళ్ళిళ్ళ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. హీరోలు నిఖిల్ సిద్ధార్థ నితిన్ పెళ్లిళ్లు ఏప్రిల్ 16వ తేదీన జరగవలసి ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లిళ్ల పై ఆంక్షలు విధించడంతో ఈ రెండు కుటుంబాలకు ఇబ్బందికరమైన పరిస్థితిలు ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. 


అయితే ఈవిషయం పై నిఖిల్ స్పందిస్తూ తన పెళ్లిని కరోనా గానీ  మరొక శక్తి కూడ ఆపలేదు అంటూ మీడియా వర్గాలతో చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఏప్రిల్‌ లో పరిస్థితి ఎలా ఉన్నా పల్లవితో జరగవలిసిన తన పెళ్ళి ఆగదు అని చెపుతూ  పరిస్థితులు అనుకూలించకపోతే గుడి లో అయినా తన పెళ్లి జరిగి తీరుతుంది అంటూ నిఖిల్ కామెంట్ చేసాడు. 


అంతేకాదు ఇప్పటికే ఈ నెలలో జరగవలసిన బ్యాచలర్స్ పార్టీ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నానని ఆతరువాత కరోనా కు భయపడి తన పెళ్లి వాయిదా వేసుకునే శక్తి తనకు లేదు అంటూ నిఖిల్ అభిప్రాయ పడుతున్నాడు. అయితే ఈ విషయంలో  నితిన్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాడు. కరోనా సమస్యతో పలురకాల ఆప్షన్ల కోసం ఆలోచిస్తున్నాం అని ఇంకా సమయం ఉన్నందున్న పరిస్థితిలో సానుకూలత ఏర్పడుతుందనే భావనలో ఉన్నాం అని నితిన్ అభిప్రాయపడుతున్నాడు.  


నితిన్ షాలిని వివాహానికి ముందస్తు ప్లాన్ ప్రకారం ఏప్రిల్ 15వ తేదీన పెళ్లి కార్యక్రమాలు అలాగే ఏప్రిల్ 16వ తేదిన రిసెప్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని భావిస్తున్న పరిస్థితులలో  సుమారు 2 వేల మందిని హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు ఆహ్వానించే పరిస్థితులలో పరిస్థితులు మారకుంటే పెళ్లిని వాయిదా వేయడమే ఒక మార్గం అని నితిన్ భావస్తున్నట్లు టాక్. దీనితో నిఖిల్ కోరనాతో యుద్దానికి రెడీ అవుతుంటే నితిన్ మాత్రం రాజీమార్గాన్ని ఎంచుకున్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: