బాలీవుడ్లో కియారా అద్వాని కి మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లోనే కాదు అటు టాలీవుడ్ లో కూడా ఈ అమ్మడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హిందీ లో బిజీ హీరోయిన్గా దూసుకు పోతుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో రామ్ చరణ్ మహేష్ బాబు సరసన పలు సినిమాల్లో నటించింది . హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్  కబీర్ సింగ్ సినిమాతో  ఈ అమ్మడు ఫేట్  మొత్తం మార్చేసింది అనే చెప్పాలి. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని  ఈ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు కు సంబంధించిన ఓ ఫోటో గతంలో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు టాప్ లెస్  గా... కేవలం ఒక చెట్టు ఆకు ను అడ్డుపెట్టుకుని... దిగిన ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. 

 

 

 అయితే ఇది ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని క్యాలెండర్ పై మెరిసిన ఫోటో అన్న  విషయం తెలిసిందే. అయితే ఈ ఫోటోలపై ఎన్ని ప్రశంసలు వచ్చాయో అంతకు మించిన విమర్శలు కూడా వచ్చాయి. దీనిపై ఒక రేంజ్లో ట్రోల్స్  కూడా జరిగిపోయాయి. అయితే ఇది నిజమైన ఫోటో కాదని... కేవలం ఫోటోషాప్ ఎడిటింగ్ ద్వారానే  ఇదంతా సాధ్యం అయ్యింది అని.. ఫోటో షాప్ లో  ఇదంతా  చేశాము అంటూ డబ్బూ రత్నాని సోషల్ మీడియా వేదికగా తెలపడంతో నెటిజన్లు అందరూ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. 

 

 

 ఇక ఈ టాప్ లెస్ ఫోటో పై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్ల పై  తాజాగా ఓ ఇంటర్వ్యూలో కియారా  అద్వానీ స్పందించింది. ఆ టాప్ లెస్ ఫోటో షూట్ ఓ సరదా  అనుభవం అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ టాప్ లెస్ ఫోటో పై సోషల్ మీడియా లో జరిగిన ట్రోలింగ్ తనను కూడా ఎంతగానో నవ్వించింది అంటూ చెప్పుకొచ్చింది. ఆ టాప్ లెస్ ఫోటో పై వచ్చిన మీమ్స్ తనను ఎంతగానో ఎంటర్టైన్ చేసాయి అంటూ తెలిపింది. ఆ ఫోటో పై వచ్చిన మీమ్స్, ట్రోల్స్  కొన్నింటిని తాను కూడా షేర్ చేశాను  అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. ఒకానొక సమయంలో తన ఇంస్టాగ్రామ్ నోటిఫికేషన్స్ ను కూడా ఆఫ్ చేయాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: