టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజా రవితేజ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఒకానొక సమయంలో వరుస విజయాలతో దూసుకెళుతున్న రవితేజ వరుస ఫ్లాపులతో సతమతమవుతు సినిమాలు ఆపేసి చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ రాజా ది గ్రేట్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకుని మళ్లీ వరుస ప్లాపులతో ప్రస్తుతం సతమతమవుతున్నారు. రవితేజ చివరి సినిమా డిస్కో రాజా చాలా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం తనకి గతంలో రెండు విజయాలు అందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  `క్రాక్` అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వేసవి సెలవుల టార్గెట్ చేసుకుని మే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అంతే కాకుండా ఈ సినిమా తర్వాత `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

 

తొలి సినిమా `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`తో ఫెయిల్యూర్ ఎదుర్కొన్న డైరెక్టర్ వక్కంతం వంశీతో ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవలే అధికారికం గా ప్రకటించారు. దీంతో వక్కంతం వంశీ తో సినిమా అనే పాటికి రవితేజ అభిమానులు కొద్దిగా డిస్టబ్ అవుతున్నారు. ఈ డైరెక్టర్లు తప్ప మరో డైరెక్టర్లు నీకు కనబడలేదా రవితేజని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. మరోసారి నీకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ పూరీ తో సినిమా చేయొచ్చు కదా అంటూ కూడా సూచనలు చేస్తున్నారు.

 

ఖచ్చితంగా పూరితో సినిమా చేస్తే నీ గ్రాఫ్ పైపైకి పోతుంది అంటూ ట్రై చెయ్ రవితేజ అన్న మనకి ఈ టైంలో హిట్టు పడాలి నువ్వు మళ్లీ ఇండస్ట్రీలో నిలబడాలి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రవితేజ మార్కెట్ పూర్తిగా బయట కనుమరుగైనటు ఇండస్ట్రీలో వార్తలు జోరందుకున్నాయి. ఇటువంటి టైం లో అట్టర్ ప్లాప్ డైరెక్టర్లతో సినిమాలు చేయడం ఏంటి అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: