కరోనా వైరస్ వల్ల చైనాలో చాలా మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల భారత్ లో కూడా వ్యాపించిన కరోనా   వ్యాప్తి రోజు రోజు తీవ్రంగా మారుతున్న సంగతి తెలిసిందే.. కరోనా వైరస్ ఎలా వస్తుంది అనేది తెలియకుండా ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదు అయ్యాయి.. అయితే ఇప్పుడు యావత్ ప్రజలు కరోనా పై భయపడుతున్నారు ..

 

 


 ఇప్పటికే కొందరు సినీ తారలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిపై పలు విధాల జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు.. ఉపాసన, విజయ్ దేవరకొండ, అమితాబ్ బచ్చన్ లు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియ జేశారు.. చేతుల ద్వారా ఎటువంటి రోగమైన కూడా తొందరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఈ వ్యాధిని అరికట్టాలంటే ముందుగా చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.. అలాగే జలుబు దగ్గు లాంటివి ఉన్న వాళ్లకు దూరంగా ఉండాలని సూచించారు.. 

 

 

 

ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం థియేటర్లు మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటింకింది. తెలుగురాష్ట్రాల్లో కరోనా కేసులు బయటపడ్డంతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇకపోతే ఈ నెలలో విడుదల కానున్న సినిమా లు వెనక్కి వెళ్లాయి. అది ఎప్పుడో చెప్పడం లేదు. ఇక సమ్మర్ కి రావాల్సిన సినిమాల షూటింగులు కూడా నిలిపేశారు. ఇలా మూకుమ్మడిగా సినిమాలు నిలిచిపోవడం చిత్ర పరిశ్రమపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇపుడు వాయిదా పడిన సినిమాలకు మళ్ళీ ఒక డేట్ కావాలి.

 

 

ఈ విషయం పై తాజాగా స్పందించిన యాంకర్ సుమ కరోనాపై జాగ్రత్తలను తెలుపుతూ వీడియోను  పోస్ట్ చేసింది.  వీడియో  మీడియాలో చక్కర్లుకొడుతుంది . ఎవరైనా కనిపిస్తే నమస్కారం చేయండి. బయట నుంచి వచ్చిన పిమ్మట చేతులను ముఖాన్ని శుభ్రంగా కడుగుకోవాలని సూచింది. ముఖం పై పడే పదే చేతులతో తాకరాదని చెప్పింది. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: