బాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హిరోయిన్ గా బాగా క్రేజ్ తో ఉంది కియారా అద్వాని. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన  భరత్ అనే నేను సినిమాలో టాలీవుడ్ కి పరిచయమైంది కియారా. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం అయింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో నటించింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాపయింది. దాంతో కియారాకి వచ్చిన క్రేజ్ ఈ సినిమాతో పోయింది. అయినా ఆఫర్స్ మాత్రం వరుసగా వచ్చాయి. కానీ అప్పటికే బాలీవుడ్ లో లస్ట్ స్టోరిస్స్ అనే అడల్ట్ కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ తో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అంతేకాదు కియారా ఏం చేసినా హాట్ టాపిక్ అవుతోంది. రీసెంట్ గా టాప్ లెస్ పోజుతో సంచలనం అయింది. 

 

కేవలం ఆకుతో తనని కవర్ చేసుకున్న ఒక  ఫోటో ఎంతో వైరల్ అయింది. సోష‌ల్ మీడియాలో ఈ ఫోటో మీద ర‌క‌ర‌కాల కామెంట్లు వచ్చాయి. అంతేకాదు కొంద‌రు గతంలో వచ్చిన లస్ట్ స్టోరీస్ లో పాత్ర మీద అలాగే రీసెంట్ గా అరిటాకు అందం గురించి కుర్రకారు కుప్పలు కుప్పలుగా మెసేజ్ లు వస్తున్నాయట. వాటిలో ఎక్కువగా కాస్త ఘాటు కామెంట్స్ ఉన్నాయట. సూటిగా చాలా వల్గర్ కామెంట్స్ కూడా అలా వచ్చిన మెసేజ్ లలో ఉన్నాయట. ఇక పొగడ్తలు, అభిమానంతో పంపుతున్న మెసేజ్ లు అయితే వేలల్లోనేనట. ఆ దెబ్బతో కియారా మెసేజెస్ రాకుండా బ్లాక్ చేసిందట.

 

ఇక తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో కియారా అద్వానీ టాప్ లెస్  ఫోజు గురించి మాట్లాడడానికి ఏం లేద‌న్న‌ట్టుగా.. ఆ  ఫోజు పై జ‌రిగిన ట్రోలింగ్ గురించినే కియారా ఎక్కువ‌గా స్పందించింది. ఆ ట్రోలింగ్ త‌న‌ను కూడా న‌వ్వించింద‌ని కియారా షాకింగ్ గా మాట్లాడింది. ఆ కామెంట్స్ అన్ని నన్ను ఎంట‌ర్ టైన్ చేశాయ‌ని వెల్లడించింది. అయితే సినిమా కోసం చేసినా, మ్యాగ్జైన్ కోసం చేసినా,  ఫోటోషూట్ కోసం ఆఫ్ న్యూడ్ గా ఫోజులిచ్చానా అది నా వృత్తిలో భాగమేనని వెల్లడించింది.

 

కబీర్ సింగ్ లో షాహిద్ కపూర్ తో బెడ్రూం సీన్స్ లో నటించినా అదంతా ఒక కొత్త అనుభవమే అంటూ తెలిపింది. సరదాకోసం ఇలాంటివి ఎవరూ చేయరు కదా ..ప్రొఫషనల్ గా  చేసిన ప్రతీసారీ ఆ అనుభవమే కొత్తగా ఉంటుందని తెలిపింది. ఇక బాలీవుడ్ లో ప్రస్తుతం అక్షయ్ కుమార్ తో లక్ష్మీ బాంబ్ అన్న సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలోను నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: