కొంతమంది హీరో కి గాని హీరోయిన్ కి గాని అలాగే ఫేడవుడ్ అయిపోయిన సీనియర్ హీరోయిన్స్ కి గాని మళ్ళీ ఒక్కసారిగా అద్భుతమైన పాత్ర పడి ఆ పాత్ర తో మళ్ళీ స్టార్ ఇమేజ్ వస్తే దానిని కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అలాంటి పాత్ర క్రియొట్ చేయడం ప్రతీ సినిమాకి సాధ్యపడదు. ప్రతీసారి సాధ్యపడదు. ఈ విషయం మేకర్స్ కి మాత్రమే కాదు నటీ నటులకి తెలుసు. అందుకే కోట శ్రీనివాస్ రావు లాంటి విలక్షణ నటులు పవర్ ఫుల్ పాత్రలు పడక చప్పబడి పోతున్నారు. ఇప్పుడు రమ్యకృష్ణ అలానే అనిపిస్తుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో విలన్ గా కూడా మెప్పించింది. ఆ తర్వాత అంతా పవర్ ఫుల్ పాత్రలు మళ్ళీ రాలేదు. 

 

అయితే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో శివగామిగా విపరీతంగా పాపులర్ అయింది. శివగామి పాత్రలోని ఠీవి రాజసంతో డైలాగ్ డెలివరీతో ప్రభాస్, రానా లతో సమానంగా పేరు సంపాదించుకుంది. కానీ అంత పవర్ ఫుల్ పాత్రలో నటించిన తర్వాత పెద్ద సినిమా చేసినా రమ్యకృష్ణ అభిమానులకు ఆనడం లేదు. మరి ఇప్పుడు తాజాగా భర్త కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న రంగ మార్తాండ సినిమాలో నటిస్తూ మరో సినిమాకు కమిటయిందని తాజా సమాచారం. 

 

మెగా హీరో సాయి ధరం తేజ్ ప్రస్థానం ఫేం దేవ కట్టా కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా రమ్యకృష్ణ కి ఎలాంటి పాపులారిటీని తీసుకు వస్తుందో చూడాలి. ప్రస్తుతం రమ్యకృష్ణ చేస్తున్న సినిమాలన్నీ మళ్ళీ తనకి సక్సస్ ఇచ్చేవేనా అంటూ అభిమానులు అడుగుతున్నారు. అయితే బాహుబలి సినిమాతో అసాధారణమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న రమ్యకృష్ణ మళ్ళీ ఆ స్థాయిలో పాత్రలు దక్కకపోవడం తో ఇప్పుడు అనవసరంగా బాహుబలి ఒప్పుకొని తప్పు చేశానని ఫీలవుతుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: