ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న rrr సినిమా షూటింగ్ వాయిదా వేయండి అంటూ రాజమౌళి చేతులు పట్టుకుని ఇద్దరు హీరోలు బతిమాలినట్లు వార్తలు వినపడుతున్నాయి. ప్రపంచంలో చైనా లో పుట్టిన ఈ వ్యాధి ప్రస్తుతం భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో వ్యాపించింది. దీంతో చాలా మంది దేశ అధ్యక్షులు ప్రధానులు తమ ప్రాంతం నుండి ఇతర ప్రాంతాలకు లేకపోతే ఇతర దేశాలకు రాకపోకలను ఆపేశారు. భారత దేశంలో కూడా ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువ రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య శాఖలో టెన్షన్ నెలకొంది.

 

మరోపక్క భారత్ అత్యధిక వేడి కలిగిన ఉష్ణోగ్రత దేశం కావటంతో భారత్ లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం లేదు అనే వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు సూచించారు.

 

ముఖ్యంగా హైదరాబాద్ నగరం లో ఈ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నట్లు వార్తలు రావడంతో…ఈ మేరకు హైదరాబాద్ కార్పొషన్ ఏకంగా పెళ్లిళ్లు, పేరంటాల మీద కూడా ఆంక్షలు విధించింది. మాల్స్, స్కూల్స్ మూసేయమంది.థియేటర్ లు బంద్ పెట్టింది. ఈ క్రమంలోనే నిర్మాతల మండలి, నటుల సంఘం ఇలా అందరూ కలిసి షూటింగ్ లు కూడా బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో కెసిఆర్ ఆదేశాల మేరకు రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆపేయాలని రాజమౌళిని కోరినట్లు ఇండస్ట్రీలో టాక్. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా షూటింగ్ ఆపేయటం జరిగింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: