సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ ఇంత వరకు సెట్స్ పైకి రాలేదు. కొత్త సినిమా మొదలవ్వడానికి మూడు, నాలుగు నెలలు పడుతుంది. ఈ టైమ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు మహేశ్. యంగ్ టాలెంట్ ఎవరు కథలు చెప్పినా వింటున్నాడు.ఆ మధ్య రిలీజై సక్సెస్ అయిన దర్శకుడు చెప్పిన కథ మహేశ్ కు నచ్చిందట.  

 

ఖాళీ వస్తే చాలు.. ఫ్యామిలీతో కలిసి ఫారిన్ కు వెళ్లడం మహేశ్ కు అలవాటు. పరశురామ్ సనిమా జూన్ లో గానీ.. జులైలో గానీ మొదలవుతుంది. ఈ లోగా యూరప్ ట్రిప్ వేయాలనుకున్నాడు. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశీ పర్యటనను విరమించుకున్నాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా.. తర్వాతి ప్రాజెక్ట్ పై దృష్టిపెట్టాడు మహేశ్. 

 

మంచి కథలు పట్టుకొస్తే.. మహేశ్ బాబు ఆఫీస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. పరశురామ్ సినిమా మొదలై రిలీజ్ కావడానికి ఏడాది పడుతుంది. ఇలా మరోసారి గ్యాప్ రాకుండా.. ముందే కథలు ఫైనల్ చేస్తున్నాడు మహేశ్. ఈ క్రమంలో భీష్మ సక్సెస్ తో గర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ మహేశ్ కు బాగా నచ్చిందట. దీంతో ఫుల్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలని మహేశ్ చెప్పాడని టాక్.

 

చూస్తుంటే సూపర్ సూపర్ స్టార్ మహేశ్ మనసు యంగ్ డైరెక్టర్స్ వైపు మళ్లినట్టుంది. నిన్న పరశురామ్, ఈ రోజు కుడుముల. యంగ్ డైరెక్టర్ హిట్ కొడితే చాలు.. కథ వినడానికి మహేశ్ రెడీగా ఉంటాడు. ఈ లెక్కన పరశురామ్ సినిమా సెట్స్ పైకి వచ్చే లోపు ఇంకెంతమంది కథలు చెప్పి మహేశ్ ను ఇంప్రెస్ చేస్తారో చూడాలి. మొత్తానికి మహేశ్ బాబు కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. యువరక్తాన్ని ప్రోత్సహించేందుకు.. వాళ్ల కథలను చాలా ఓపికగా వింటున్నాడు. మరి ఏ యంగ్ డైరెక్టర్ కథ ఆయనకు నచ్చుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: