మహానటితో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు నాగ అశ్విన్. అంతకుముందు చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా కూడా పర్వాలేదు అనిపించింది. అయితే సావిత్రి బయోపిక్ గా చేసిన మహానటి మాత్రం అతన్ని పది మెట్లు ఎక్కేలా చేసింది. సావిత్రి జీవిత కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించారు నాగ్ అశ్విన్ అందుకే ఆయనకు రావాల్సిన అవార్డులు, రివార్డులు వచ్చేశాయి. ఇక మహానటి తర్వాత తన సినిమా ఏంటన్నది ఇప్పటివరకు చెప్పని నాగ్ అశ్విన్ ఈమధ్యనే ప్రభాస్ తో ఇంటర్నేషనల్ లెవల్ లో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఎనౌన్స్ చేశారు. 

 

ప్రభాస్ తో సినిమా అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఏంటన్నది తెలిసింది. ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా చేస్తున్న ప్రభాస్సినిమా పూర్తయ్యాక నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమా ఉన్నా నాగ్ ఈ గ్యాప్ లో వెబ్ సీరీస్ డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. రానాతో ఒక వెబ్ సీరీస్ ప్లాం చేస్తున్నాడట నాగ్ అశ్విన్. ఈ టాలెంటెడ్ డైరెక్టెడ్ చేస్తున్నాడు అంటే ఆ వెబ్ సీరీస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటుంది. 

 

రానా లాంటి ఆర్టిస్ట్ తో నాగ్ అశ్విన్ ఎలాంటి వెబ్ సీరీస్ చేస్తాడా అని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ వెబ్ సీరీస్ ను నాలుగు నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత ప్రభాస్ సినిమా వర్క్ స్టార్ట్ చేస్తాడట నాగ్ అశ్విన్. ఈమధ్య దర్శకులు వెబ్ సిరీస్ ల మీద దృష్టి పెట్టారు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ మీద కూడా ఆడియెన్స్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో అక్కడ కూడా స్టార్స్ హంగామా మొదలైంది. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో ఈ వెబ్ సీరీస్ లు వస్తున్నాయి. 

 

ప్రస్త్తుతం రానా అరణ్య సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. తెలుగులో విరాట పర్వం సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఆ సినిమా బడ్జెట్ విషయంలోనే ఇంకా ఒక క్లారిటీ రావట్లేదని తెలుస్తుంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: