తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు ప్రత్యేకత ఉందని తెలిసిందే...అయితే రమ్యకృష్ణ ఏ పాత్ర వేసిన కూడా ఆ పాత్రలో ఆమె జీవించి నటించడం ఆమె ప్రత్యేకత.. అలాంటి రమ్యకృష్ణ ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చింది..అయితే ఆమె చేసి ప్రతి పాత్ర ఒక అద్భుతమని చెప్పాలి..అందుకే ఆమెతో పాటు చేసిన హీరోయిన్ల అందరూ కూడా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది...

 

 

 

ఇటీవల ప్రపంచాన్ని గడ గడ లాడించిన సినిమా బాహుబలి లో ప్రత్యేక పాత్రలో నటించిన రమ్య కృష్ణ ఆ సినిమాతో శివగామి పేరుతో అభిమానుల మనసును చూరగొంది.. ఆ తర్వాత వచ్చిన సోగ్గాడే చిన్ని నయన సినిమాలో నటించిన ఈమె నటనకు మరో సారి జీవం పోసింది..ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. అమ్మవారు లాంటి పాత్రల్లో నటించడం ఒక్క రమ్యకృష్ణ కే సాధ్యం.. అంతా గొప్ప మహానటి ఆమె...


 

 

ఇకపోతే రమ్యకృష్ణ ఇప్పుడు ప్రత్యేక పాత్రలో విభిన్న కథాంశంతో రూపొందిన సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తానం టుంది అది కూడా విలన్ పాత్రలో కనిపించి అలరిస్తానని అంటుంది అసలు విషయానికొస్తే..
నెగెటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్రలో ఆమె జీవించిన తీరుకి ప్రశంసలు లభించాయి. ఆ పాత్రకి రమ్యకృష్ణనే కరెక్ట్ అనుకున్నారు అందరూ. విలనిజంతో కూడిన అలాంటి పవర్ ఫుల్ పాత్రలోనే ఆమె మరోమారు కనిపించనుంది.సాయితేజ్ - దేవకట్టా కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాలో ఆమె ఈ తరహా పాత్రను పోషించనుంది. సాయితేజ్ - దేవ కట్టా కాంబినేషన్లో ఓ పొలిటికల్ డ్రామా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.



 

 

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకున్నారట. శివగామి తరువాత రమ్యకృష్ణ చేసిన పాత్రలేవీ ఆ స్థాయిలో ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. అందువలన ఈ పాత్ర తన కెరియర్ ను మరింత ఊపుతో ముందుకు తీసుకెళుతుందని రమ్యకృష్ణ బలంగా నమ్ముతోందని అంటున్నారు... ఆ సినిమాలో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: