‘భీష్మ’ సూపర్ సక్సస్ తో వెంకీ కుడుమల వైపు టాప్ హీరోల దృష్టి పడింది. దీనితో ‘భీష్మ’ సక్సస్ అయినందుకు అభినందనలు తెలుపుతూ మంచి కథ ఉంటే కలవమని వెంకీ కుడుమలకు చెపుతున్న హీరోల సంఖ్య పెరుగుతున్నట్లు టాక్. ఇప్పుడు ఈ లిస్టులో మహేష్ కూడ చేరిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. 


తెలుస్తున్న సమాచారం మేరకు మహేష్ స్వయంగా ఆహ్వానించడంతో వెంకీ కుదుమల లేటెస్ట్ గా మహేష్ ను కలిసి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథను చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మహేష్ పరుశు రామ్ కథను ఒకే చేయడంతో పరుశు రామ్ నాగచైతన్యను వదులుకుని ఇప్పుడు మహేష్ కథ విషయమై తన టీమ్ తో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతూ మహేష్ మూవీని వీలైనంత త్వరలో మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో వెంకీ కుడుమల మహేష్ ను ఎందుకు కలిసిసాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పడుతున్నాయి. మహేష్ ఒక దర్శకుడుతో సినిమా చేస్తానని మాట ఇచ్చి మాట తప్పడం మొదటిసారి కాదు. సుకుమార్ విషయంలో వంశీ పైడిపల్లి విషయంలో మహేష్ ఇలాంటి పొరపాట్లు చేయడంతో ఒక విధంగా దర్శకులు మహేష్ ను నమ్మలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు వెంకీ కుడుమల మహేష్ ను కలవడం ఒక విధంగా పరుశు రామ్ కు టెన్షన్ కలిగించే విషయం. మహేష్ సన్నిహితులు మాత్రం ఈ విషయానికి మరొక విధంగా వివరణ ఇస్తున్నారు. ‘భీష్మ’ మూవీని చూసిన తరువాత మహేష్ కు ఎంకీ కుడుమల ప్రతిభ బాగా నచ్చిందని అందువల్ల యధాలాపంగా మహేష్ వెంకీ కుడుమలను అభినందించడానికి తన వద్దకు పిలిపించుకున్నాడు కాని కథలు వినడానికి కాదు అంటూ ఈ విషయం పై మరొక విధంగా స్పందిస్తున్నారు. అయితే మహేష్ మనస్తత్వం బాగా తెలిసిన పరుశు రామ్ కు మటుకు తన మూవీ ప్రారంభం అయ్యేవరకు తన భయాలు కొనసాగుతూనే ఉంటాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: