టాలీవుడ్ లోకి maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన నటి సమంత.  మాలీవుడ్ లో మోడలింగ్ కెరీర్ తో మొదలైన ఆమె ప్రస్థానం యాంకర్ గా కూడా చేసింది.  గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య సరసన ‘ ఏం మాయ చేసావే’ మూవీతో మంచి విజయం అందుకుంది.  ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎందిగింది.  అయితే సమంత లక్కీ బాగుందనే చెప్పొచ్చు.  ఆమె నటించి సినిమాలు తెలుగు, తమిళంలో సూపర్ హిట్టే అయ్యాయి.  అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె అసలు సినిమాల్లో నటిస్తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి.

 

కానీ వివాహం జరిగిన తర్వాతనే సమంత నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు అనుష్క, నయన తార, త్రిష లాంటి వారు లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తున్నారు.  వీరి బాటలో సమంత నడుస్తుంది.  యూటర్న్, ఓ బేబీ లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీల్లో నటించి మెప్పించింది. తాజాగా ఇంకో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ మూవీని 'గేమ్ ఓవర్' ఫేమ్ అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ కాంబినేషన్ సినిమాని సోనీ పిక్చర్స్ నిర్మించనున్నది. 

 

తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఇందులో హీరో క్యారెక్టర్‌కు తమిళ సీనియర్ నటుడు ప్రశాంత్‌ను సంప్రదిస్తుండటం. తొలిముద్దు, దొంగ దొంగ, జీన్స్‌, జోడి.. వంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన ప్రశాంత్‌  ఆ మద్య రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయరామ’ మూవీలో నటించాడు.   తమిళ మీడియా ప్రకారం ప్రశాంత్ వైపు నుంచి ఇంకా అంగీకారం రాలేదు. త్వరలోనే అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: