టాలీవుడ్ లో అగ్ర దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆయన మంచి సినిమాలు చేసారు. ఎందరో హీరోలకు హిట్ సినిమాలు అందించారు ఆయన. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ప్రభ తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయన కథల్లో పట్టు లేకపోవడమే అంటున్నాయి సినీ వర్గాలు. గతంలో పూరి కథలకు ఒక డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఆ డిమాండ్ తగ్గింది అంటున్నారు. దానికి కారణం దాదాపు అన్ని కథలు ఒకే విధంగా ఉండటమని టాలీవుడ్ లో టాక్. 

 

హీరో అంటే ఇలాగే హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా పూరి పని చేస్తున్నారు. దీనితో ఆయన దర్శకుడు అయినా పర్వాలేదు గాని ఆయన కథ మాత్రం వద్దని అంటున్నారు టాలీవుడ్ హీరోలు. అందుకే ఎన్టీఆర్ వక్కంతం వంశీ ఇచ్చిన కథతో టెంపర్ సినిమా చేసాడు. ఆ తర్వాత ఆయన చేసిన కొన్ని సినిమాలు చికాకు పెట్టాయి అనేది వాస్తవం. సినిమాలో పట్టు లేకపోయినా హీరో ఆధారంగానే సినిమా ఉండే విధంగా తీయడం, హీరోని ఎక్కువ హడావుడి చేసే విధంగా పాత్ర ఇవ్వడం వంటివి ఆయన్ను ఇబ్బంది పెట్టాయి అనేది వాస్తవం. 

 

ఇటీవల వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఆయనకు మంచి హిట్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే బాగుండూ అంటూ అతని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ కాలంలో సినిమా పూర్తి చేసే పూరి ఈ సినిమాకు మాత్రం ఎక్కువ సమయం తీసుకోవడంతో సినిమా ఏ విధంగా ఉంటుంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా గురించి కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఎం చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: