టాలీవుడ్ లో జాగర్లమూడి రాధాకృష్ణ, అలియాస్ క్రిష్ ది ఒక ప్రత్యేక శైలి. ఆయన సినిమాలు అనగానే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. హీరోతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చూస్తూ ఉంటారు. ఆయన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటుంది. గమ్యం సినిమా క్రిష్ మినహా మరో దర్శకుడు చేసి ఉంటే ఆ స్థాయిలో ఆకట్టుకునేది కాదు అంటారు ప్రేక్షకులు. వేదం సినిమా క్రిష్ దర్శకత్వంలో వచ్చిందే. ఆ సినిమా చాలా మంది ప్రేక్షకులకు ముందు నచ్చలేదు. ఆ తర్వాత మాత్రం టీవీ లో వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూడటం మొదలుపెట్టారు. 

 

ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనుష్క ని ఒక వేశ్య పాత్రలో చూపించడం చూసి బాలీవుడ్ షాక్ అయింది. ఆమెలో ఉన్న టాలెంట్ ని ఆమెను చూపించిన విధానం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇచ్చాయి. సినిమాలో ఒక మెసేజ్ కచ్చితంగా ఉంటుంది. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా అవసరం అయితే యుట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. క్రిష్ సినిమాల్లో ఉండే డైలాగులు కూడా ప్రత్యేక అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి.

 

బాలకృష్ణ హీరోగా తీసిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎంతో ఆకట్టుకుంది. ఈ రెండు భాగాలలో బాలకృష్ణ ను చాలా జాగ్రత్తగా చూపించారు క్రిష్. ఇక ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి కూడా దగ్గరవుతారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: