బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు అతను చేసే సినిమాలన్నీ నేషనల్ లెవెల్ అప్పీల్ ఉండాల్సిందే. బాలీవుడ్ లో కూడా ప్రభాస్ ని మించిన స్టార్ లేడంటే అతిశయోక్తి కాదేమో! మరి అలాంటి హీరో సినిమాలో నటించాలంటే వాళ్లకి ఎలాంటి ఛరిష్మా ఉండాలి. ఇండియా మొత్తం ప్రేక్షకులని కన్విన్స్ చేయాలంటే అందుకు తగ్గట్టుగా స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండాల్సిందే. అందుకే సాహో సినిమాలో మొత్తం పరభాషా నటులతో నింపేశారు.

 

 

అయితే ఆ సినిమా ఫలితం నెగెటివ్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పూజా హెగ్డే ప్రభాస్ సరసన కథానాయికగా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించే వారిలో ఎక్కువ భాగం పరభాషా నటులే ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటీనటులే కాదు టెక్నీషియన్లని సైతం ఇతర భాషల నుండి తీసుకొస్తున్నారట.

 

 

ఇక ఈ చిత్రానికి సంగీతం వాయించేది ఎవరనేది చాలా ఆసక్తిగా మారింది. సాహో చిత్రానికి బాలీవుడ్ నుండి తీసుకువచ్చి ఇద్దరు ముగ్గురితో సంగీతం చేయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలోనూ అదే ఫాలో అవుతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి ఎవరు మ్యూజిక్ అందిస్తున్నారనేది తెలియదు. కాకపోతే సంగీత దర్శకుడిని సైతం బాలీవుడ్ నుండే దిగుమతి చేసుకుంటున్నారట.

 

 

ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల  చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం తర్వాత మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో ఈ కథ  ఉండనుందట. ఈ సినిమాలోనూ ఎక్కువ మంది పరభాషా నటులే ఉంటారని అర్థం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: