తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉవ్వెత్తున ఎగసిపడే కెరటంలా తెర మీదికి వచ్చి సంచలనం సృష్టించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. నాని హీరోగా నటించిన సినిమాలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ చేసి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్తో అందరినీ ఆకర్షించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాలో అవకాశం దక్కించుకుని మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత అర్జున్ రెడ్డి తో  విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో  వెళ్ళిపోయింది. అయితే అర్జున్ రెడ్డి కి భిన్నంగా గీత గోవిందం అనే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. అప్పుడు వరకు రౌడీ హీరో అంటే ప్రేక్షకులందరూ లో ఉన్న ఇంప్రెషన్  మారుస్తూ... గీత గోవిందం లో ఎంతో ఇన్నోసెంట్ గా  చూపించాడు. 

 

 

 గీత గోవిందం సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ తో రష్మిక మందన రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ  సినిమాలో  గడుసు పిల్ల గా రష్మిక మందన్న నడిస్తే.. అమాయకుడైన అబ్బాయిగా  విజయ్ దేవరకొండ నటించాడు. ఇక వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులు అందరూ మెచ్చే విధంగా తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఇక ఈ సినిమాతో ఏకంగా వంద కోట్లు దర్శకుడిగా కూడా మారిపోయాడు. ఇక గీత గోవింద సినిమా తో ఈ దర్శకుడి ఫేట్  మొత్తం మారిపోయింది అని చెప్పాలి. 

 

 

 స్టార్ హీరోల అందరి చూపు ఈ దర్శకుడి మీద  పడింది. ఇక పరశురాం తో సినిమా తీసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. పరుశురాం  దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమా అద్భుతంగా ఉండడంతో... దర్శకుడు పరశురామ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అనే చెప్పాలి. అటు అర్జున్ రెడ్డి కి గీత గోవింద సినిమా ఎంత క్రేజ్ తెచ్చిపెట్టిందో.. ఇటూ  దర్శకుడు పరుశురాం కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దీంతో ఏకంగా మహేష్ బాబుతో సినిమా చేసేందుకు పరశురామ్ ఛాన్స్ కొట్టేశాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా రౌడీ హీరో సినిమాతో క్రేజీ  డైరెక్టర్ పరుశురాం మాత్రం ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: