వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. ఈయన గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఈయన తీసే సినిమాలలో వివాదాలు ఉంటాయో ఉండవో తెలియదు కానీ.. ఈయన జీవితంలో మాత్రం ప్రతి ఒక్కటి వివాదమనే చెప్పాలి. ఆయనకు ఏమన్నా వివాదాలు లేకుంటే వివాదాలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి మరి వివాదాలు సృష్టించుకుంటాడు ఆర్జీవీ. 

 

 

రామ్ గోపాల్ వర్మ సహాయ దర్శకుడిగా ఎక్కడ పనిచేయకుండానే తన మొదటి సినిమా "శివ" ను కింగ్ నాగార్జునతో వెండి తెరకు ఎక్కించాడు. ఈ సినిమాతో ఆర్జీవీ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పట్లో ఈ సినిమా బాగా హిట్ అయింది. ఈయన క్షణం క్షణం ఇంకా హిందీలో పలు సినిమాలు తీసి ఒక డైరెక్టర్ గా విజయం సాధించి ఇండస్ట్రీలో నిలదొక్కుకుని స్థిరపడ్డాడు. 

 

 

ఈయన కెరీర్ ప్రారంభంలో తెరకెక్కించిన సినిమాలు ట్రెండ్ ని సెట్ చేశాయని చెప్పవచ్చు. సినిమాల కంటే వివాదంలో ముందుండే ఈ దర్శకుడు కెరీర్‌ ప్రారంభంలో తెరకెక్కించిన ఎన్నో సినిమాలు అప్పట్లో హిట్ కొట్టి వర్మ క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఈ వివాదాస్పద దర్శకుడు ఇటీవల కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీసి పెద్ద వివాదాన్ని తలకెక్కించుకున్నాడు ఆర్జీవీ. ఈయన ప్రవర్తనకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. ఏదన్న విషయం ఉంటే ముక్కుసూటిగా మాట్లాడేస్తుంటారు ఈయన. అందుకే కాబోలు ఈయనకు ఆపేరు. 

 

 

ప్రస్తుతం ఆర్జీవీ గతంలో సంచలనం సృష్టించిన దిశ ఘటన గురించి తెలిసిందే.. అయితే రామ్ గోపాల్ వర్మ దిశ సంఘటన గురించి సినిమా తీసే పనిలో పడ్డాడు. దీనికై ఆయన ఆ నలుగురు దోషులలో ఒకడైన చెన్నకేశవులు భార్యతో కూడా మాట్లాడారు. తన భర్త ఇంట్లో కానీ, స్నేహితులతో కానీ, తన తల్లిదండ్రులతో కానీ ఎలా ఉండేవాడని తెలుసుకున్న విషయాలు విధితమే...

 

మరింత సమాచారం తెలుసుకోండి: