‘కేజీ ఎఫ్’ మూవీతో నేషనల్ సెలెబ్రెటీగా కన్నడ స్టార్ యష్ మారిపోయాడు. అతడికి బాలీవుడ్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడ వేల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ క్రేజ్ ను మరింత కొనసాగించడానికి యష్ ‘కేజీ ఎఫ్ 2’ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మింప చేస్తూ ఆ మూవీ పై చాల భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 


మూవీ ‘బాహుబలి 2’ రేంజ్ లో హిట్ అవుతుందని బాలీవుడ్ మీడియా ఇప్పటికే ఊహాగానాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ రిలీజ్ డేట్ పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇస్తూ ఈ మూవీ మేకర్స్ అక్టోబర్ 23న దసరా ను టార్గెట్ ఈ మూవీ విడుదల అవుతున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు. 


కరోనా దెబ్బతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ షేక్ అవుతూ దీనివల్ల నష్టం వేల కోట్లల్లో ఉంటుంది అన్న అంచనాలు వస్తున్న పరిస్థితులలో కరోనా సమస్య ఇంకా పరిష్కారం కాకుండానే యష్ తన ‘కేజీ ఎఫ్ 2’ డేట్ ను చాల ముందుగా ప్రకటించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా కరోనా ను కూడ లెక్క చేయకుండా ప్రభాస్ జార్జియా వెళ్ళి అక్కడ తన లేటెస్ట్ మూవీ షూటింగ్ ను కొనసాగిస్తూ ఈ మూవీ షూటింగ్ ను ఆగష్టు నాటికి పూర్తి చేసి దసరా కు విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. 


అంతేకాదు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ప్రకటనతో పాటు ఈ మూవీ రిలీజ్ డేట్ ను రాబోతున్న ఉగాది రోజున ప్రకటించాలని ప్రభాస్ ఇప్పటికే దానికి సంబంధించిన ఆలోచనలలో ఉన్నాడు. మరి ఈ లీకులు తెలుసుకుని కాబోలు యష్ ప్రభాస్ వ్యూహాలకు చెక్ పెడుతూ చాల ముందుగానే తన ‘కేజీ ఎఫ్ 2’ రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇప్పుడు ప్రభాస్ పరిస్థితి ఏమిటి అంటూ అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: