రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం నుండి ఆప్టేట్స్ కోసం ఎప్పటినుండో కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఈ సినిమా నుండి అతి త్వరలో  ఫస్ట్ లుక్ రానుందని  డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నాడు. దాంతో  ఉగాది కానుకగా మార్చి 25న  ఈ ఫస్ట్ లుక్  విడుదల కావడం పక్కా.. ఇక ఈ సినిమా షూటింగ్ గత కొద్దీ రోజుల నుండి జార్జియా లో జరుగుతుండగా ఈరోజు తో షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. దాంతో ప్రభాస్ తో సహా చిత్ర యూనిట్ ఇండియా కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం కరోనా  ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే  ముఖ్యంగా యూరప్ లో దీని ప్రభావం ఎక్కువగా  వుంది అయినా కూడా ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ  షూటింగ్ జరిపి సక్సెస్ ఫుల్ గా షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ ను పెట్టనున్నట్లు సమాచారం. గోపి కృష్ణ మూవీస్ ,యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. 
 
 ఈ చిత్రం తరువాత ప్రభాస్, తన తదుపరి చిత్రాన్ని మహానటి ఫేమ్  నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యం లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈచిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్  ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ప్రస్తుతం నాగ్ అశ్విన్  నిర్మాత గా మారి జాతి రత్నాలు అనే సినిమా ను నిర్మిస్తున్నాడు. రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్ ల్లో నటిస్తున్న ఈచిత్రాన్ని పిట్టగోడ ఫేమ్ అనుదీప్ తెరకెక్కిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: