ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి కి ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఆయనతో సినిమా చేయడానికి ఎందరో హీరోలు పోటీ పడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ట్రిపుల్ ఆర్ తర్వాత తమ తో సినిమా చెయ్యాలని కోరిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అతనికి మంచి క్రేజ్ ఉన్న నేపధ్యంలో నిర్మాతలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ మధ్య. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలు గా ట్రిపుల్ ఆర్ సినిమా పూర్తి అయిన తర్వాత రాజమౌళి తో చేయడానికి చాలా మంది పోటీ పడుతున్నారు. 

 

మరి ఎవరికి ఆ అవకాశం దొరుకుతుందో చూడాలి. ప్రస్తుతం చేస్తున్న సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రాజమౌళి విడుదల చేసేందుకు గాను సిద్దమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక భాగం షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. మిగిలిన భాగాన్ని కూడా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత పూర్తి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది పక్కన పెడితే ఇప్పుడు అతను రామ్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో గాని దీనిపై పెద్ద ప్రచారమే ఇప్పుడు జరుగుతుంది. 

 

రామ్ రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ఆ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కథ కూడా రెడీ అయింది అంటున్నారు. ఆ కథను రాజమౌళి తండ్రి రాజేంద్ర ప్రసాద్ పూర్తి చేసారని అంటున్నారు. కథను త్వరలోనే రామ్ కూడా వినే అవకాశం ఉందని ఈ సినిమాను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఈ సినిమాను తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: