ఒక్కటే ఒక్క సినిమా ఆ దర్శకుడిని పాన్ ఇండియా దర్శకుడిగా మార్చేసింది. ఏమంటూ ఆ సినిమా మొదలు పెట్టాడో తెలియదు గాని ఇండియన్ సినిమాను ఒక ఊపు ఊపింది. ఆ సినిమానే కేజీఎఫ్. బంగారు గనుల్లో కార్మికుల జీవితాల ఆధారంగా, పోరాటాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడం, హింది భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయింది. భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. అగ్ర హీరోలు ఎవరికి దక్కని విజయం ఈ సినిమాతో యష్ కి దక్కింది. 

 

ఇక ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. అక్కడి నుంచి అతని తో సినిమా చేయడానికి ఎందరో హీరోలు పోటీ పడుతున్నారు. అగ్ర హీరోలు బాలీవుడ్ లో టాలీవుడ్ లో అతనితో సినిమాలు చేయడం కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో అతనితో సినిమా చేయడానికి కొందరు స్టార్ హీరోలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఒక స్టార్ హీరో అతనితో సినిమా చేయడానికి ఈ మధ్య బెంగళూరు కూడా వెళ్లి వచ్చినట్టు సమాచారం. దీనిపై ప్రశాంత్ ఏమీ స్పందించడం లేదని, 

 

తాను ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాలో బిజీ గా ఉన్నా అని ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకి వస్తుంది అని అప్పుడు తాను ఇతర సినిమాల మీద ఎక్కువ దృష్టి పెడతాను అని చెప్పాడట ప్రశాంత్. దీనితో ఆ హీరో మళ్ళీ బెంగళూరు వస్తా అని చెప్పి వెళ్ళాడట. అయితే ఆ దర్శకుడుని కలిసింది మహేష్ బాబు అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అతని తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం కొన్ని రోజులుగా ఎక్కువగా జరుగుతుంది. మరి ఎవరితో సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: