ప్రముఖ యాంకర్, నటి రష్మీ సామాజిక మాధ్యమాల్లో చాలా చురుకుగా ఉంటారు. అయితే కొందరు ఆకతాయిలు వేధించేందుకు ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. అలాంటి వారికి బాగానే కౌంటర్ ఇస్తోంది రష్మీ.. గతంలోనూ ఎందరికో చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చిన రష్మీ.. తాజాగా మరో వ్యక్తికి గడ్డి పెట్టింది.

 

 

ఓ వ్యక్తి కరోనా గురించి మాట్లాడుతూ... రష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షోను, ఆమె డ్రస్సింగ్ పైనా అసభ్యంగా కామెంట్ చేశాడు. దీంతో రష్మి రెచ్చిపోయింది. ఘాటుగా చెప్పుతో కొట్టి నట్టు సమాధానం చెప్పింది. కరోనా, టీవీ షో.. పరస్పర సమస్యలని భావించే వారు ముందు వారి ఆలోచనల్ని మార్చుకోండి. అయినా ఇదంతా డిమాండ్‌ - సరఫరాపై ఆధారపడి ఉంటుందని కామెంట్ చేసింది.

 

 

రష్మీ ఇంకా ఏమందంటే.. “ మేం మీ చేతులు, కాళ్లు కట్టేసి టీవీ ముందు కూర్చో పెట్టలేదు. మేం మీకు నచ్చనట్లు డ్యాన్స్‌ చేసినప్పుడు కళ్లు మూసుకోవచ్చు. లేదంటే ఛానెల్‌ మార్చుకోవచ్చు. ఒక్క షో హిట్‌ అవ్వడానికి ముఖ్య కారణం ఆడియన్స్‌. మమ్మల్ని స్వీకరించిన వారికి మేం కృతజ్ఞతా భావంతో ఉంటాం. షోతో సమస్యలున్న వారు చూడకుండా ఉండొచ్చంటూ గడ్డి పెట్టింది.

 

 

అంతే కాదు.. పోనీ.. మీరొక సినిమా తీస్తుంటే అందులో నన్ను సతీ సావిత్రి పాత్రకు తీసుకోండి. నేను ఎంచుకున్న పని గురించి నన్ను ప్రశ్నించొద్దు. నాకు వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన దాన్ని ఎంచుకుని మీ అందరిలాగే పనిచేస్తున్నా అంటూ ఆన్సర్ చేసింది రష్మీ.. అంతే కాదు.. రష్మీ కామెంట్ పై స్పందించిన వ్యక్తి ఓ ఫారినర్ బొమ్మ పెట్టుకున్నాడు. దీనిపై స్పందించిన రష్మీ.. విదేశీయుడి ఫొటో పెట్టుకుని.. సొంత గుర్తింపు లేకుండా భారతీయ విలువలు, సంప్రదాయాల గురించి మాట్లాడటం ఏంటని కౌంటర్ ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: