వేసవి వస్తుందంటే చాలు బాక్సాఫీస్ కు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. సమ్మర్ సినిమాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కానీ ఈ వేసవికి మాత్రం థియేటర్లు వెలవెలబోతున్నాయి. కరోనా భయానికి సినిమా హాళ్లకు తాళాలు వేస్తున్నారు. దీంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కోట్లలో నష్టాలొస్తున్నాయి. 

 

సమ్మర్ ను క్యాష్ చేసుకోవాలని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది హీరోలు స్కెచ్చులు రెడీ చేస్తున్నారు. నాని నుంచి మొదలుపెడితే.. విజయ్, అక్షయ్ కుమార్ వరకు స్టార్లంతా సమ్మర్ పై బోలెడన్ని హోప్స్ పెట్టుకున్నారు. కానీ కరోనా ప్రభావంతో థియేటర్లు మూతపడుతున్నాయి. దీంతో వీళ్ల సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి.


ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో రూపొందిన థ్రిల్లర్ వి. 25వ సినిమాగా కెరీర్ లో ల్యాండ్ మార్క్ ఫిల్మ్ గా రూపొందిన వి పై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు. పైగా ఈ మూవీలో నాని కొంచెం గ్రే-షేడ్ లో కనిపిస్తాడని చెబుతున్నారు. దీంతో ఆడియన్స్ మార్చి 25కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు ఖాళీ అవుతూ ఈ సినిమాను వాయిదా వేశాయి. 

 

విజయ్ ఈ సమ్మర్ ను గట్టిగా ఫోకస్ చేశాడు. మాస్టర్ సినిమాతో భారీ వసూళ్లు సాధించాలని ప్లాన్ చేశాడు. ఏప్రిల్ 9న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ ఇఫ్పుడు కరోనా ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడుతున్నాయి. కరోనా భయం తగ్గేవరకు మాల్స్  బిజీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో మాస్టర్ ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నాడు విజయ్.

 

అక్షయ్ కుమార్, రోహిత్  శెట్టి కాంబినేషన్ లో రూప1ందిన క్రేజీ మూవీ సూర్యవంశీ. ఈ మూవీలో అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్ స్పెషల్ రోల్స్ ప్లే చేశారు. స్టార్ కాస్టింగ్ తోనే స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ మూవీ మార్చి 24న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ సూర్య వంశీని వాయిదా వేస్తున్నారు నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: