ప్రిన్స్ మహేష్ బాబుకు అభిమానులు ఉన్న స్థాయిలో కాకపోయినా అతడి వ్యతిరేకులు కూడ  గణనీయంగా పెరిగిపోతున్నారు అన్న కామెంట్స్ గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ వద్ద డైరక్టర్ల కోసం మహేష్ కిందామీద పడిపోతు అనేకమంది యంగ్ డైరెక్టర్స్ కు కబురు పెడుతూ కథలతో తనను వచ్చి కలవమని అడుగుతున్నాడు అంటూ ఒక కొత్త నెగిటివ్ ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. 


దీనితో మహేష్ కు దర్శకుల కొరత ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపడుతున్నారు. వాస్తవానికి ఇలాంటి గాసిప్ రావడం వెనుక ఒకకారణం ఉంది. మహేష్ ను ఈమధ్య ‘భీష్మ’ దర్శకులు వెంకీ కుడుమల కలిసాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనికంటే ముందు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడ మహేష్ ను కలిసిసాడు అంటూ ఆమధ్య వార్తలు వచ్చాయి. 


ఈలిస్టుకు కొనసాగింపుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ హిట్ దర్శకుడు శైలేష్ కొలను కూడ మహేష్ ను ఈమధ్య కలిసినట్లు వార్తలు హడావిడి జరిగింది. దీనితో ఇంతమంది యంగ్ దర్శకులు వరస పెట్టి మహేష్ ను ఎందుకు కలుస్తున్నారు అంటూ ఇప్పుడు అనేక సందేహాలు కలుగుతున్నాయి. దీనితో మహేష్ తో సినిమా తీసే టాప్ దర్శకులు ఎవరు లేకపోవడంతో ఇలా మహేష్ యంగ్ డైరెక్టర్స్ వైపు పరుగులు తీస్తున్నాడు అంటూ నెగిటివ్ ప్రచారం ప్రారంభం అయింది. 


వాస్తవానికి మహేష్ ఇప్పటికే దర్శకుడు పరుశు రామ్ మూవీని ఓకె చేసాడు అంటూ స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో మహేష్ మళ్ళీ ఇంతమంది యంగ్ డైరెక్టర్స్ ను వరస పెట్టి కలుస్తూ ఉండటం అనేక సందేహాలకు అదేవిధంగా నెగిటివ్ ప్రచారానికి ఆస్కారం కలిగిస్తోంది. వాస్తవానికి మహేష్ పరుశు రామ్ కు ఆప్షన్ ఇచ్చాక మరే ఆలోచనలు లేకుండా ఉన్నాడని అయితే అతడి కాలు సమస్య కోసం మళ్ళీ అమెరికా వెళ్ళవలసిన నేపధ్యంలో మధ్యలో కరోనా వ్యవహారం రావడంతో ఎక్కడకి వెళ్ళడం ఇష్టంలేక మహేష్ టైమ్ పాస్ కోసం యంగ్ డైరెక్టర్స్ చెప్పే కథలు వింటూ ఉంటే అతడి వ్యతిరేకులు ఈ నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టారు అంటూ అతడి సన్నిహితుల అభిప్రాయం.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: